Just In
- 48 min ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 4 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 5 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
Don't Miss
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Movies The GOAT Life Review పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మ్యాన్ షో.. కానీ సహనానికి పరీక్షే.. ఆడుజీవితం సినిమా సమీక్ష
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి
కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా సంక్రమిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ మూడవ దశలో ఉంది. ఈ లాక్ డౌన్ 2020 మే 17 వరకు ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడవ దశలో లాక్ డౌన్ నుంచి కొన్ని విరమణలు కూడా కల్పించారు.
లాక్ డౌన్ లో కలిగించిన కొన్ని మినహాయింపుల ప్రకారం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వాహన సేవలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. రెడ్ జోన్లో ఇప్పటికి కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి.
కరోనా వైరస్ సంక్రమణము నివారించాలంటే సామాజిక దూరం చాలా అవసరం కాబట్టి ఈ క్రమంలో ఒక పాల వ్యాపారి ఒక కొత్త పద్దతిని ప్రవేశపెట్టాడు. ఇది అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MOST READ:భారత్లో విడుదల కానున్న 2020 డుకాటీ మల్టీస్ట్రాడా 950 బైక్
కోవిడ్ -19 వ్యాప్తి మధ్య సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు పాలు సరఫరా చేయడానికి తన బైక్కి కట్టిన గరాటు మరియు పైపును ఉపయోగించి ఒక మిల్క్మ్యాన్ ఫోటో మనం ఇక్కడ చూడవచ్చు.
ఈ చిత్రాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి నితిన్ సంగ్వాన్ ట్విట్టర్లో షేర్ చేసాడు. ఇటీవల కాలంలో చాలామంది తమను మరియు తమ నుండి ఇతరులను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి కొత్త ఉపాయాలను ఆలోచిస్తున్నారు.
MOST READ:ఇండియాలో ఎప్రిలియా RS 660 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా ?
ఇప్పుడు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినప్పుడు కూడా మాస్కులు మరియు గ్లౌజులు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పాల వ్యాపారి ఈ విధంగా అలోచించి సామజిక దూరాన్ని అమలుచేస్తున్నాడు.
సంగ్వాన్ షేర్ చేసిన ఈ చిత్రంలో ఒక పాలవ్యాపారి సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ తన వినియోగదారునికి పాలు సరఫరా చేయడాన్ని చూడవచ్చు. అతను తన బైక్కు ఒక గరాటు మరియు పైపును అటాచ్ చేసి అలా చేశాడు. పాలు కావాలనుకున్న కస్టమర్ పైపు చివర నిలబడతాడు. అప్పుడు పాల వ్యక్తి పాలు గరాటు ద్వారా సరఫరా చేస్తాడు.
MOST READ:రీస్టార్ట్ చేయనున్న హోండా మోటార్ సైకిల్స్
ఈ కరోనా నేపథ్యంలో చాలామంది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారట. ఇటీవల కాలంలో ఒకవ్యక్తి తన కుమార్తె కోసం సామాజిక దూరాన్ని పాటించే ఒక బైక్ కూడా తయారు చేసాడు. ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.