Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
భారతదేశంలో మొట్టమొదటి కరోనా టెస్టింగ్ బస్, ఇదే
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి భారిన పడుతున్న ప్రజలు లెక్కకు మించిపోతున్నారు. దేశంలో ఎక్కువగా కరోనా వైరస్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. కోవిడ్ 19 వైరస్ పరీక్షించడానికి ముంబైలో మొబైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభించబడింది. ఈ పరీక్షా కేంద్రం బస్సులో ఏర్పాటు చేయబడింది.
జావా మోటార్సైకిల్కు అనుబంధ సంస్థ అయిన క్లాసిక్ లెజెండ్ కరోనా సమయంలో ఈ పరీక్షా కేంద్రాన్ని వెలుగులోకి తెచ్చింది. కృష్ణ డయాగ్నోస్టిక్ పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలనే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి కోవిడ్ 19 టెస్టింగ్ బస్సును సిద్ధం చేసింది.
బస్సు పరీక్షా కేంద్రాన్ని ఐఐటి అలుమ్ని కౌన్సిల్, బిఎంసి మరియు కృష్ణ డయాగ్నోస్టిక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ముంబైలో ప్రయోగించిన ఈ బస్సు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరోనావైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
MOST READ:2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !
ఈ పరీక్షా కేంద్రం AI-ఆధారిత టెలిరాడియాలజీ మరియు RT-PCR ని పరీక్షిస్తుంది. మొబైల్ టెస్ట్ బస్సు కరోనా వైరస్ పరీక్ష ఖర్చును 80% వరకు తగ్గిస్తుందని ఈ బస్సు తయారీదారులు తెలిపారు.
ఇది రాబోయే 100 రోజుల్లో పరీక్ష సామర్థ్యాన్ని 100% పెంచుతుంది. ప్రస్తుతం ఈ బస్సులో గంటకు 10 నుండి 15 పరీక్షా నమూనాలను మాత్రమే తీసుకుంటారు. ప్రతి నమూనా సేకరణ క్రిమిసంహారక తరువాత మాత్రమే జరుగుతుంది. ఇది జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో స్క్రీనింగ్ చేయడం సులభం చేస్తుంది.
MOST READ:మీరు ఎప్పుడైనా అతి చిన్న త్రీ-వీల్ మారుతి సుజుకి 800 కారు చూసారా ?
ఈ బస్సుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పరీక్షలు చేయవచ్చు. భారతదేశంలో ఋతుపవనాల ప్రారంభంతో ఈ ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. బస్సులు నగరంలోని వివిధ ప్రదేశాలకు ప్రయాణించి నమూనాలను సులభంగా తీసుకుంటాయి.
కరోనా సమయంలో సేవ చేసే పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు అవసరమైన సేవలను అందించే వారు ఈ బస్సును పరీక్షిస్తున్నారు. సామర్థ్యం పెరిగేకొద్దీ ఇది సాధారణ ప్రజలకు కూడా ఉపయోగించబడుతుంది. ఏది ఏమైనా కరోనా నివారణలో ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది.
MOST READ:ఐసిఐసిఐ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న మారుతి సుజుకి, ఎందుకంటే ?