Just In
- 6 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 7 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గిఫ్ట్గా పొందిన థార్ ఎస్యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]
ఇండియన్ క్రికెట్ టీమ్ 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంచి పర్ఫామెన్స్ చూపించిన ఆరుగురు క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
ఈ ఆరు మంది క్రికెటర్లలో మహమ్మద్ సిరాజ్, టి నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, శుబ్మాన్ గిల్ మరియు నవదీప్ సైని ఉన్నారు. వీరు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ కి విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే వీరికి ఆనంద్ మహీంద్రా థార్ ఎస్యూవీని ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇటీవల నవదీప్ సైని తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో తాను గిఫ్ట్ గా పొందిన మహీంద్రా థార్ ఎస్యూవీలో ఆఫ్-రోడ్ రైడ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోలో క్రికెటర్ నవదీప్ సైనీ కఠినమైన రోడ్లపైన డ్రైవ్ చేయడం చూడవచ్చు. 4x4 సిస్టమ్ కలిగి ఉన్న థార్ ఎస్యూవీలో నవదీప్ ఫన్ రైడ్ లాంటిది చేశారు.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని
నవదీప్ గత నెలలో మహీంద్రా థార్ ఎస్యూవీని సొంతం చేసుకున్నాడు. నవదీప్ సైనీ సొంతం చేసుకున్న కొత్త మహీంద్రా థార్ బ్లాక్ కలర్ లో ఉంది. ఈ ఎస్యూవీ అతడు అతని కుటుంబ సభ్యులుతో కలిసి వచ్చి డెలివరీ చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నవదీప్ సైని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఐపిఎల్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?
కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీ విషయానికొస్తే, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆఫ్-రోడ్ వాహనాలలో ఇది ఒకటి. ఈ థార్ ఎస్యూవీ యొక్క అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యం కారణంగా, చాలా మంది వాహనదారులు ఈ థార్ ఎస్యూవీని ఇష్టపడుతున్నారు.
ఈ కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీని కంపెనీ 2020 అక్టోబర్ 2 న విడుదల చేసింది. అయితే ఈ ఎస్యూవీ యొక్క డెలివరీలు గత ఏడాది నవంబర్లో ప్రారంభించారు. థార్ ఎస్యూవీ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి అత్యధిక డిమాండ్ ఉంది. కావున థార్ యొక్క బుకింగ్స్ రోజు రోజుకి ఎక్కువవుతున్న సమయంలో అందరికీ డెలివరీ చేయలేకపోతున్నారు.
MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
ఎందుకంటే ఉత్పత్తి కంటే ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల ఈ ఎస్యూవీ యొక్క ఉత్పత్తి మరింత ఎక్కువయ్యింది. అయితే ఉత్పత్తికి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. దీని ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ మరింత ఎక్కువయ్యింది.
మహీంద్రా థార్ ఎస్యూవీ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.