Just In
- 26 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 3 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 3 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Movies Kaliyugam Pattanamlo Review ఏపీలో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్తో.. కలియుగం పట్టణంలో సినిమా రివ్యూ
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
గిఫ్ట్గా పొందిన థార్ ఎస్యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]
ఇండియన్ క్రికెట్ టీమ్ 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంచి పర్ఫామెన్స్ చూపించిన ఆరుగురు క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
ఈ ఆరు మంది క్రికెటర్లలో మహమ్మద్ సిరాజ్, టి నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, శుబ్మాన్ గిల్ మరియు నవదీప్ సైని ఉన్నారు. వీరు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ కి విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే వీరికి ఆనంద్ మహీంద్రా థార్ ఎస్యూవీని ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇటీవల నవదీప్ సైని తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో తాను గిఫ్ట్ గా పొందిన మహీంద్రా థార్ ఎస్యూవీలో ఆఫ్-రోడ్ రైడ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోలో క్రికెటర్ నవదీప్ సైనీ కఠినమైన రోడ్లపైన డ్రైవ్ చేయడం చూడవచ్చు. 4x4 సిస్టమ్ కలిగి ఉన్న థార్ ఎస్యూవీలో నవదీప్ ఫన్ రైడ్ లాంటిది చేశారు.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని
నవదీప్ గత నెలలో మహీంద్రా థార్ ఎస్యూవీని సొంతం చేసుకున్నాడు. నవదీప్ సైనీ సొంతం చేసుకున్న కొత్త మహీంద్రా థార్ బ్లాక్ కలర్ లో ఉంది. ఈ ఎస్యూవీ అతడు అతని కుటుంబ సభ్యులుతో కలిసి వచ్చి డెలివరీ చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నవదీప్ సైని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఐపిఎల్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?
కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీ విషయానికొస్తే, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆఫ్-రోడ్ వాహనాలలో ఇది ఒకటి. ఈ థార్ ఎస్యూవీ యొక్క అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యం కారణంగా, చాలా మంది వాహనదారులు ఈ థార్ ఎస్యూవీని ఇష్టపడుతున్నారు.
ఈ కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీని కంపెనీ 2020 అక్టోబర్ 2 న విడుదల చేసింది. అయితే ఈ ఎస్యూవీ యొక్క డెలివరీలు గత ఏడాది నవంబర్లో ప్రారంభించారు. థార్ ఎస్యూవీ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి అత్యధిక డిమాండ్ ఉంది. కావున థార్ యొక్క బుకింగ్స్ రోజు రోజుకి ఎక్కువవుతున్న సమయంలో అందరికీ డెలివరీ చేయలేకపోతున్నారు.
MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
ఎందుకంటే ఉత్పత్తి కంటే ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల ఈ ఎస్యూవీ యొక్క ఉత్పత్తి మరింత ఎక్కువయ్యింది. అయితే ఉత్పత్తికి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. దీని ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ మరింత ఎక్కువయ్యింది.
మహీంద్రా థార్ ఎస్యూవీ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.