Just In
- 56 min ago ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- 2 hrs ago ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- 4 hrs ago వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- 4 hrs ago మితిమీరిన అభిమానం.. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి విజయ్ కారు అద్దాలు ధ్వంసం, వీడియో వైరల్
Don't Miss
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Movies ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
దేశంలో కొంతమంది వ్యాపారదరులు కొన్ని కొన్ని సార్లు కొన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతారు. గతంలో ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అని చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఒక కేజీ మాంసం కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ప్రకటించాడు, ఒక మాంసం కొట్టు యజమాని. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మదురై జిల్లాలోని తిరుమంగళంలో మఖిల్విట్టు మఖిల్ అనే మాంసం అంగడి ఉంది. ఈ దుకాణంలో ఒక కేజీ మాంసం కొనుగోలు చేస్తే ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్ను జూలై స్పెషల్ ఆఫర్గా ప్రకటించారు. ఇక్కడ ఒక కిలో మాంసం కొనే వారికి టోకెన్ ఇవ్వబడుతుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆ టోకెన్ ఇచ్చినట్లైయితే ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది.
ఈ ఆఫర్ కేవలం ఈ నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్పై కస్టమర్ల నుండి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తోంది. దీనిపై న్యూస్ 18 తమిళనాడు ఛానల్ నివేదించింది. భారతదేశంలో ఉచితంగా పెట్రోల్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. ప్రపంచంలో పెట్రోల్పై అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాలలో భారతదేశం ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులు విధించడం వల్ల భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చౌకైనది కాని, భారతదేశంలో వాహనదారులకు మాత్రం టకెక్కువ ధరకు అందుబాటులో లేదు. పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించాలని వాహనదారులు ప్రభుత్వాలను చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి.
పెట్రోల్ మరియు డీజిల్ ధరల ప్రభావాన్ని తట్టుకోలేక చాలామంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల రాయితీలు కూడా ప్రవేశపెట్టాయి.
ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు కల్పించబడింది. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మరింత పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Image Courtesy: News18 Tamil Nadu