2000సీసీ పైబడి ఉన్న డీజల్ కార్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించిన సుప్రీం కోర్టు
దేశ వ్యాప్తంగా ఎక్కువగా కార్ల రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకుంటున్న నగరం ఢిల్లీ. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యంత వాహన కాలుష్యం గల నగరాలలో కూడా ఢిల్లీ ముందు స్థానంలో ఉంది. ఈ కారణం మీద సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల డీజల్ వాహనాల అమ్మకాలను నిషేదించింది.
Also Read: భారతీయ మార్కెట్లో విప్లవం సృష్టిస్తున్న టాటా "జికా": టెస్ట్ డ్రైవ్ వివరాలు
ఇప్పటికే దేశ రాజధాని నగరం ఢిల్లీలో సరి మరియు బేసి రూల్ అమలులో ఉంది. అనగా వాహనం యొక్క నంబర్ సరి సంఖ్యతో అంతం అయ్యే వాటిని ఒక రోజు మరియు బేసి సంఖ్యతో అంతం అయ్యే వాహనాలను ఒక రోజు రోడ్ల మీదకు అనుమతిస్తారు. అలా కాదని విరుద్దంగా వెళ్లారనుకోండి అంతే సంగతులు. ఢిల్లీ నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి కఠినతరమైన రూల్స్ ను కేజ్రివాల్ ప్రభుత్వం అమలుపరుస్తోంది.
Also Read: ఉత్తమ డిసెంబర్ ఆఫర్లను ప్రకటించిన టయోటా మోటార్స్
అయితే సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వలన భారతీయ కార్ల మార్కెట్ కేవలం ఢిల్లీ పరిధిలో మాత్రమే దాదాపుగా 1000 కోట్ల రుపాయల వరకు నష్టపోతున్నట్లు తెలిసింది.



Click it and Unblock the Notifications








