Just In
- 1 hr ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 2 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 4 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 5 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
Don't Miss
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తూ ఇప్పటికే ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరించింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ రూల్స్ పాటించని వారికీ కఠినమైన శిక్షలు కూడా విధించబడుతుంది. ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కారులో ఒంటారిగా ప్రయాణించే వాహనదారునికి కూడా తప్పనిసరిగా మాస్క్ ఉండాలని ఆదేశాలు జరీ చేసింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి నగరాల్లో కరోనా నివారణకు కర్ఫ్యూ విధించారు. కావున ఈ కరోనా కర్ఫ్యూకి ప్రజలు కూడా సహకరించాలి.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఢిల్లీ నగరంలో ఒక జంట కారులో మాస్కులు ధరించకుండా, నియమాలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడ్డ ఈ జంట పోలీసులపై విఱుచైకుపడటం మీరు వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీధిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
నివేదికల ప్రకారం మాస్కులు లేకుండా కారులో వెతున్న చలానా విధించారు. అయితే దీనికి గాను ఆ జంట పోలీసులపైకి వాగ్వాదానికి దిగారు. ఆ మహిళ పోలీసులతో వాళ్ళ నాన్న కూడా పోలీస్ అని మీకు ఇష్టమొచ్చినట్లు చేసుకోండని తెగేసి చెబుతుంది. ఆ జంట దగ్గర కర్ప్యూ పాస్ లేదని పోలీసులు గుర్తించారు.
పోలీసులు వారిపై సెక్షన్ 188, 51 బి కింద కేసు నమోదు చేసి, జరిమానా కూడా వాదించి పోలీస్ స్టేటన్ కి తీసుకెళ్లారు. వారిని పంకజ్ దత్తా, అభా యాదవ్గా గుర్తించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి
కరోనా సంక్రమణను నివారించడానికి, కారులో ప్రయాణించే ప్రజలు కూడా ఇప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలా కాదని నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇది కాకుండా, మార్గదర్శకాలను పాటించకపోతే కరోనా వ్యాప్తి కేసు కూడా దాఖలు చేయవచ్చు.
కరోనా రోజురోజుకి ఎక్కువగా సంక్త్రమిస్తోంది, దేశ రాజధాని నగరం ఢిల్లీలో కేవలం 24 గంటల్లో 25462 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 161 మంది ప్రజలు ఈ మహమ్మరి వల్ల ప్రాణాలు వదిలారు.
MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 8 లక్షల 53 వేల 460 మందికి కరోనా వైరస్ సోకిందని నిర్దారించబడింది. ఇందులో దాదాపు 12,121 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఢిల్లీలో కరోనా వైరస్ యొక్క కేసులు మరింత ఎక్కువగా పెరిగిందని గుర్తించబడింది.
కరోనా మహమ్మారి కారణంగా రోజు రోజుకి ఎంతమంది మరణిస్తున్న సంఘటనలు టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలామంది ఇప్పటికి కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కరు చేసే పొరపాటు కూడా చాలామందిపై ప్రభావం చూపిస్తుంది. కావున ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే ఈ మహమ్మరి నుంచి విముక్తి పొందే అవకావం ఉంటుంది.
MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
Image Courtesy: ANI News