Just In
- 25 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 16 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 18 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏంజరుగుతోందో తెలుసా.. అయితే ఇది చూడండి
భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తోంది. ఈ భయంకరమైన మహమ్మారి వైరస్ కి వ్యాక్సిన్ లేదు. కాబట్టి జీవితాలను పనంగా పెట్టాల్సి వస్తుంది. ఈ కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ కారణంగా ప్రజలు పనిచేసేటప్పుడు సామాజిక దూరాన్ని కొనసాగించాలని ఆదేశిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కొత్త విధానాన్ని అవలంబించారు. ట్రాఫిక్ రద్దీని అరికట్టడానికి మరియు ప్రజలతో కనీస సంబంధాలు కలిగి ఉండటానికి న్యూ ఢిల్లీలో కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు SMS లేదా స్పీడ్ పోస్ట్ నోటీసులు పంపుతున్నారు.
ఇది పోలీసులకు మరియు ట్రాఫిక్ ఉల్లంఘించేవారికి మధ్య కనీస సంబంధాన్ని నిర్ధారిస్తుంది. కరోనా సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరాన్ని పాటించడం చాలా అవసరం. లాక్ డౌన్ సమయంలో మిలియన్ల మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది.
MOST READ:మద్యం మత్తులో బైక్ నుంచి కొడుకుని కిందపడేసిన తండ్రి [వీడియో]
ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 1,00,436 మందికి ఎస్ఎంఎస్ ద్వారా, 80 మందికి స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మార్చి 25 నుంచి మే 17 మధ్య ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఈ నోటీసులు పంపారు.
నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన 7998 మంది కెమెరాలో రికార్డ్ చేశారు. వీరందరికీ పోలీసులు నోటీసు జారీ చేశారు. కెమెరాలో రికార్డ్ చేసిన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం వర్చువల్ కోర్టును సృష్టిస్తామని తెలిపారు.
MOST READ:అదిరిపోయే లుక్ లో ట్రయంప్ టైగర్ 900 బైక్ టీజర్
32,722 కేసులు వర్చువల్ కోర్టులలో పరిష్కరించబడ్డాయి. కాంటాక్ట్లెస్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు కెమెరా ద్వారా నిబంధన యొక్క ఉల్లంఘనలను గుర్తించడానికి అప్లికేషన్ మరియు లేజర్ స్పీడ్ గన్ వినియోగ ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ విభాగం ప్రత్యేక కమిషనర్ తాజ్ హసన్ తెలిపారు.
రహదారిపై పెరుగుతున్న వాహనాల సంఖ్యతో, జంక్షన్ నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, లేన్ ఉల్లంఘనలను నివారించడానికి మరియు పార్కింగ్ చేయకుండా ఉండటానికి ప్రాధాన్యతనిస్తున్నామని కూడా చెప్పారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
MOST READ:కొత్త వాహనాల కొనుగోలుకు బ్రేక్ వేసిన UP గవర్నమెంట్, ఎందుకంటే ?
లాక్ డౌన్ నాల్గవ దశ అమలులో ఉంది. ఈ నాల్గవ దశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. దీని ఫలితంగా ఢిల్లీ-నోయిడా మరియు ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దులో రోజువారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి ఇ-పాస్ అవసరమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో చాలా సడలింపులు కల్పించారు.