Just In
- 13 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 15 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 17 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఢిల్లీ To లండన్ బస్ సర్వీస్ రద్దు.. కారణం ఇదే
కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. కరోనా లాక్ డౌన్ ప్రభావం ప్రజా రవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పుడు ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లే బస్సు సర్వీసుపై ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గుర్గావ్కు చెందిన అడ్వెంచర్ ఓవర్ల్యాండ్ కంపెనీ ఏప్రిల్లో ప్రారంభించబోయే బస్సు సర్వీసును రద్దు చేసింది.
ఈ ఏడాది ఈ బస్ సర్వీస్ బుకింగ్స్ రద్దు చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ బుకింగ్స్ 2022 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమవుతాయి. భారతదేశంలో కరోనావైరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతర దేశాలకు ప్రయాణించే ప్రయాణికులు పరిమితం చేయబడ్డారని కంపెనీ తెలిపింది.
MOST READ:బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ: ఫుల్ వీడియో.. ఇప్పుడు మీకోసం
కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ ఏడాది అన్ని పర్యటనలను రద్దు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అడ్వెంచర్ ఓవర్ల్యాండ్ కంపెనీ బస్సు 70 రోజుల్లో ఢిల్లీ నుంచి లండన్కు వెళుతుంది. ఈ బస్సు ఢిల్లీ నుండి బయలుదేరి 18 దేశాల ద్వారా దాదాపు 20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి బ్రిటన్ రాజధాని లండన్కు చేరుకుంటుంది.
ఈ బస్సు సర్వీస్ కి 'బస్ టు లండన్' అని కంపెనీ పేరు పెట్టింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం మరియు ఫ్రాన్స్ మీదుగా లండన్ చేరుకుంటారు.
MOST READ:రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!
లండన్ వెళ్లే ఈ బస్సులో 20 సీట్లు ఉన్నాయి. అందులోని అన్ని సీట్లు బిజినెస్ క్లాస్కు చెందినవి. ఈ బస్సులో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గైడ్ మరియు ఇతర సిబ్బందితో పాటు 20 మంది ప్రయాణికులు ఉంటారు.
ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లే ప్రయాణికులు ఒక్కొక్కరికి టికెట్టు ధర రూ. 15 లక్షలు చెల్లించాలి. ఈ 70 రోజుల పర్యటనలో ప్రయాణికులు 4 లేదా 5 స్టార్ హోటళ్లలో ఉండటానికి అనుమతిస్తుంది. ఈ పర్యటనలో పర్యాటకులు తమ సొంత ఆహారం మరియు ఎంటర్టైన్మెంట్ వంటివి ఆస్వాదించవచ్చు.
ఢిల్లీ నుంచి లండన్ వరకు బస్సు ప్రయాణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నెన్నో దేశాల్లో ప్రయాణిస్తూ కొత్త సంస్కృతులను, కొత్త కొత్త ఆహారాలను రుచి చూడవచ్చు. 70 రోజుల ఈ ప్రయాణం జీవితంలో ఒక గొప్ప మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. కానీ కరోనా మహమ్మారి దీనిని పూర్తిగా రద్దు చేసింది.
MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి