Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లాక్డౌన్కు స్వస్తి పలికిన ఢిల్లీ ప్రభుత్వం; ఈ సర్వీసులన్నీ అందుబాటులోకి వచ్చేశాయ్
భారతదేశంలో కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ఈ మహమ్మారి నివారణలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొంతవరకు తగ్గుముఖం పట్టించి. ఈ కారణంగా మనదేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని ఆంక్షలతో కరోనా లాక్ డౌన్ సడలించడం జరిగింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల 2021 జూన్ 14 అనగా ఈ రోజు నుంచి (సోమవారం) ఢిల్లీలో కరోనా లాక్ డౌన్ ఎక్కువ భాగం సడలించారు. అయితే ఈ సమయంలో ప్రజలు తప్పకుండా కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సడలింపుతో మార్కెట్లు మరియు ఆఫీసులు మళ్ళీ ప్రారంభించబడ్డాయి. అంతే కాకుండా మెట్రో సర్వీస్, క్యాబ్లు మరియు ఆటోలు వంటి ప్రజా రవాణా కూడా సడలించబడింది. అయితే ఇందులో ప్రయాణించే ప్రజలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
ఢిల్లీలో గత వారం మెట్రో మరియు బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడపడానికి అనుమతించారు. ప్రయాణీకులు ఈ వాహనాలలో ప్రయాణించేటప్పుడు ఒక సీటు వదిలి ఇంకో సీటులో కూర్చోవాల్సి ఉంటుంది. అయితే ప్రయాణ సమయంలో నిలబడి ప్రయాణించడానికి అనుమతించబడదు.
ఇది మాత్రమే కాకుండా ఆటో, క్యాబ్, ఇ-రిక్షాల్లో కూడా ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతించబడుతుంది. ఇద్దరు ప్రయాణికులకంటే ఎక్కువమంది ప్రయాణించడానికి అనుమతించబడదు.
ఢిల్లీలో కరోనా లాక్ డౌన్ సడలించినప్పటికీ ఇతర రాష్ట్రాల్లోకి ప్రయాణించటానికి ఎటువంటి పరిమితి లేదు. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ నివాసులు ప్రక్కనే ఉన్న నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ మరియు ఇతర ఎన్సిఆర్ నగరాలకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతి గాని పాస్ గాని అవసరం లేదు.
ఇంతకుముందు మార్కెట్లు మరియు మాల్స్ సరి మరియు బేసి పద్దతిలో ఓపెన్ చేయడానికి అనుమతించబడ్డాయి. కానీ ఇప్పుడు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరవడానికి అనుమతించారు. అదే సమయంలో, రేషన్, పాలు మొదలైన ముఖ్యమైన వస్తువులతో కూడిన దుకాణాలను రాత్రి 8 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచవచ్చు.
ఇవి మాత్రమే కాకుండా 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్ వంటివి కూడా ప్రారంభించబడ్డాయి. ఇదే సమయంలో కరోనా నియంత్రణలో భాగంగా అన్ని భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ విధానం 2021 జూన్ 20 వరకు ట్రయల్ ప్రాతిపదికన నడుస్తుంది, నిబంధనలు పాటించకపోతే, లేకుంటే కేసులు పెరిగితే, మార్కెట్లు, మాల్స్, రెస్టారెంట్లు మళ్లీ మూసివేయబడతాయి.
ఇప్పుడు కూడా బార్లు మరియు పబ్బులకు అనుమతి లేదు, దీనితో పాటు రెస్టారెంట్లలో మద్యం అందించబడదు. సినిమా హాళ్లు, పార్కులు మరియు ఉద్యానవనాలు కూడా తెరవడానికి అనుమతించబడలేదు.
ఢిల్లీలో ఆఫీసులు 9 నుండి 5 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతించినప్పటికీ 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరవవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రజారోగ్యంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఢిల్లీలో ఆదివారం 255 కొత్త కేసులు నమోదుచేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే నగరంలో పాజిటివిటీ రేటు 0.35 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే కేసుల సంఖ్య దాదాపు తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది.