Just In
- 12 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 13 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లవర్ కోసం 8 బైకులు దొంగలించిన యువకుడు, చివరికి ఏమైందంటే.. ?
భారతదేశంలో వాహన దొంగతనం కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాహనదారులు ఎన్ని కొత్త టెక్నాలజీలను ఉపయోగించిన ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ కారణంగా వాహనదారులందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన వాహనాలు ఉన్నవారు మరింత ఎక్కువ భయపడుతున్నారు.
వాహనాలను దొంగిలించే వారు ఖరీదైన వాహనాలను దొంగలించి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ విధంగా దొంగతనాలు చేసి పోలీసులకు దొరికితే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కేసు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాహన దొంగతనానికి సంబంధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వారు ఎందుకు వాహనాలు దొంగలిస్తున్నారనే ప్రశ్నకు చెప్పిన సమాధానం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వరసగా వాహన దొంగతనాలు జరిగాయి. వాహనాలను పోగొట్టుకున్న వాహనదారుల పిర్యాదు కారణంగా పోలీసులు దీనిపై ద్రుష్టి పెట్టారు.
ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న దొంగలు కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే ఎందుకు దొంగలిస్తున్నారని పోలీసులు ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసారు. పోలీసుల కథనం మేరకు ఇద్దరు వ్యక్తులు రూ. 1.80 లక్షల విలువ కలిగిన ఒక బైకుపై నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం గమనించిన పోలీసులు వారిని అనుమానించి విచారించినప్పిడు బైక్ దొంగలు వీరే అని గుర్తించారు.
బైక్ దొంగలుగా గుర్తించిన ఇద్దరు లలిత్, సాహిద్ అనే సన్నిహితులు. బీహార్ నుంచి వచ్చిన లలిత్ 9 వ తరగతి వరకు చదువుకుని వాటర్ ప్లాంట్లో పనిచేసేవాడు. అంతే కాకుండా లలిత్ కి ఒక లవర్ కూడా ఉండేది.
లలిత్ తన లవర్ తో కలిసి ఎప్పుడూ పార్టీలకు వెళ్లడం వంటివి చేసేవాడు. ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే రోజు లలిత్ కి బైక్ లేనందుకు తన ప్రేయసి కోపంతో తిట్టింది. ఇది లలిత్ మనసును విచ్ఛిన్నం చేసింది. అప్పుడు ఎక్కువ సంఖ్యలో బైకులు ఉండాలని నిర్చయించుకున్నాడు.
తన ప్రేయసి తనను ఎగతాళి చేసిందని లలిత్ తన స్నేహితుడు సాహిద్తో చెప్పాడు. వీరిద్దరూ కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రారంభించారు. వీరిద్దరూ హోండా ఆక్టివాతో వారు నడుపుతున్న బైకుతో సహా మొత్తం ఎనిమిది వాహనాలు దొంగలించారు. ఈ నేరాన్ని పోలీసుల వద్ద అంగీకరించారు.
తన ప్రేయసిని మెప్పించడానికి ఫ్రెండ్ తో కలిసి మోటార్ సైకిల్స్ దొంగతనం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా చెలరేగింది. అంతే కాకుండా లలిత్ మరియు సాహిద్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఇలాంటి దొంగతనాలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ అప్రమత్తంగా ఉండండి. కారును పార్కింగ్ చేసేటప్పుడు, తలుపులు లాక్ చేయండి. తలుపులు లాక్ చేయబడిందని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
కొంతమంది వాహనదారులు వాహనంలోనే కీని వదిలివేస్తారు. కారు కిటికీలను ఎప్పుడూ తెరవకండి. ఇది కారు లోపల ఖరీదైన వస్తువులను దోచుకోవడానికి సహాయపడుతుంది. వాహనాలు సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పార్క్ చేయండి.
Image Courtesy: Tanseem Haider/India Today