భారత్లో వాడుకలో ఉన్న అంబులెన్స్ రకాల గురించి మీకు తెలుసా?
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ యొక్క తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా వైరస్ కారణంగా రోజుకి 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో చాలా మంది మరణిస్తున్నారు. వీరిలో దాదాపు 85% మంది కరోనా బాధితులు హోమ్ క్వారంటైన్ లో ఉంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు.

కరోనా సోకినా వారిలో కేవలం 15% మంది మాత్రమే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనా బాధితులకు అత్యవసరమైన సమయంలో హాస్పిటల్ కి చేరుకోవడానికి 108 కు కాల్ చేసి అంబులెన్స్ సర్వీస్ పొందవచ్చు. అంతే కాకుండా సమీపంలో ఉన్న ఏదైనా హాస్పిటల్ ని సంప్రదించి అంబులెన్స్ సర్వీస్ పొందవచ్చు.

అంబులెన్సులలో బాధితునికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆక్సిజన్ సిలిండర్ వంటివి కూడా ఉంటాయి. కరోనా ఎక్కువగా వ్యాపించడం వల్ల దేశంలో వెంటిలేటర్ల కొరత ఉంది. కావున వీటికి ప్రస్తుత సమయంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఈ సర్వీస్ అందిస్తున్నాయి.

కొన్ని అంబులెన్సులలో కొన్ని సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి, మరికొన్ని అంబులెన్స్లలో పూర్తి ఐసియు సౌకర్యాలు ఉన్నాయి. ఇటువంటి హై టెక్నాలజీ కలిగిన అంబులెన్స్లలో రోగి ప్రాణాలను కాపాడటానికి వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఇటువంటి సదుపాయాలు కలిగిన అంబులెన్సులకు అయ్యే ఖర్చు సాధారణ అంబులెన్సులకంటే ఎక్కువ ఉంటుంది. కరోనా సోకిన వారికి సాధారణ అంబులెన్సులకంటే ఇటువంటి హైటెక్ అంబులెన్సులు తగినదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థకు సంబంధిచిన అంబులెన్సులో రోగికి కావలసిన ఆక్సిజన్ వంటివి కూడా అమర్చబడి ఉంటాయి.

రోగులకు ఇంట్లో ఆక్సిజన్ను అందించే అంబులెన్స్లను వ్యాన్ అంబులెన్సులు లేదా కార్ అంబులెన్సులు అంటారు.ఈ భారతదేశంలో ఇటువంటి అంబులెన్సులు 6 రకాలుగా ఉంటాయి. ఈ అంబులెన్సులు విషయానికి వస్తే,
మొదటి రకం అంబులెన్స్ నే ఒరిజినల్ అంబులెన్స్ లేదా సాధారణ అంబులెన్స్ అంటారు. ఒక వ్యక్తి కొన్ని రోజులు అనారోగ్యంతో ఉంటే ఈ అంబులెన్స్ ఉపయోగించబడుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయే అంబులెన్స్ రెండవ రకం అంబులెన్స్ ఒక లేటెస్ట్ అంబులెన్స్. దీనినే ఎమర్జెన్సీ అంబులెన్స్ అని కూడా అంటారు.

ఈ ఎమర్జెన్సీ అంబులెన్స్లో ఆక్సిజన్తో సహా వివిధ వైద్య సౌకర్యాలు ఉన్నాయి. మూడవ రకం అంబులెన్స్ ఒక మార్చురీ అంబులెన్స్. ఈ అంబులెన్సులు చనిపోయినవారి మృతదేహాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. నవజాత శిశువులకు నాల్గవ రకం అంబులెన్స్ ఉపయోగించబడుతుంది. ఈ రకమైన అంబులెన్స్లో పిల్లలకు అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి.

ఐదవ రకం అంబులెన్స్ రోగులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి ఉపయోగించే సాధారణ అంబులెన్సుల కోవకి వస్తాయి. ఈ అంబులెన్స్ను పేషంట్స్ క్యారియర్ అంబులెన్స్ అని పిలుస్తారు. ఇక ఆరవ రకం అంబులెన్స్ ఎయిర్ అంబులెన్సులు. ఈ అంబులెన్స్లో రోగులను ఒక నగరం నుండి మరొక నగరానికి తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు.

ఈ అంబులెన్స్ రోగులను ఆసుపత్రులకు తరలించడానికి అనువైనది. ఈ అంబులెన్స్ రోగులను వేగంగా ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. రోగులను వేగంగా ఆసుపత్రికి తీసుకురావడానికి ఎయిర్ అంబులెన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి అత్యవసర సమయంలో కొన్ని ఆర్గాన్స్ తరలించడానికి కూడా ఉపయోగపడతాయి.

ఇప్పుడు భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా అంబులెన్సులు లేకపోవడంతో, చాలా మంది రోగులను తమ సొంత కార్లలో తరలిస్తున్నారు. కానీ రోగులను ఈ విధంగా కార్లలో తరలించడం చాలా ప్రమాదం. ఇది కారులోని వ్యక్తులకు కూడా కరోనా సంక్రమించే అవకాశం ఉంది. కావున కరోనా బాధితులను అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








