హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపకండి.....అని చెప్పిన ముఖ్యమంత్రి!
టూ వీలర్స్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్లు ధరించే నిర్బంధానికి వ్యతిరేకంగా కఠినమైన ప్రచారాలు చేయడం వల్ల ఇప్పుడు పుణె నగరం కొంత కాలం వార్తల్లో నిలిచింది. ఈ విషయం, వాస్తవానికి అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు నగరానికి చెందిన ఇతర ప్రముఖ వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని రైడ్ చేసేటప్పుడు హెల్మెట్లు ధరించడాన్ని నిరసిస్తూ చేతులు కలిపారు.

ఇదే విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం పూణె పోలీసులను కలిసి సిసిటివి కెమెరాలను ఉపయోగించి నేరస్థులకు వారి ఇళ్లకు చలాన్లు పంపాలని కోరారు. హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణించే ప్రజలను వేధింపులకు గురిచేయవద్దని సిఎమ్ అన్నారు.

ఆయన పూణెకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను సందర్శించిన తరువాత, ఆయన ఈ ప్రకటనను జారీ చేయరు.పూణేలో కొన్ని నెలల క్రితం పూర్తి స్థాయి హెల్మెట్ దహనకాండ జరిగింది, ఇది సమాజంలోని అన్ని రకాల ప్రజల నుంచి మద్దతు కూడగట్టడం జరిగింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ...

"పూణేకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను కలుసుకొని పూణే పోలీసులు, హెల్మెట్లు ధరించి ప్రజలు ప్రయాణించాలి అనే సాకుతో ,వారిని వేధిస్తున్నారు అని, దీని వలన ప్రజలు చాలా ఇబందులకి గురి అవుతున్నారని చెప్పారు. అలాగే ముంబై మరియు నాగపూర్ లో,

పోలీసులు ట్రాఫిక్ నేరస్థులపై సిసిటివి నెట్ వర్క్ ఉపయోగించడం ద్వారా హెల్మెట్ లను ఉపయోగించని ద్విచక్ర రైడర్ లపై జరిమానాలు వేస్తున్నారు. పూణే పోలీసులు కూడా ఈ టెక్నాలజీని ఊఆయోగించడం వలన ఉల్లంఘులు తగ్గడం మరియు ప్రయాణీకులు హెల్మెట్లు ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పారు.

నగర ట్రాఫిక్ పోలీసులు అమర్చిన సిసిటివి కెమెరాలు హెల్మెట్లు లేకుండా రైడింగ్ చేసే వారిని ఇట్టే పట్టుకోగలవు. ద్విచక్ర వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ప్లేట్ ని స్పష్టంగా చూపించే ఒక చిత్రంని తీయగలవు, తరువాత ఈ-చలాన్ గా కన్వర్ట్ చేయబడి వారి ఏంటికి నేరుగా వస్తుంది.

ఈ చలాన్లు ఆన్ లైన్ లో కూడా చెల్లించవచ్చు. ఇలా చెల్లించకపోతే మరియు ద్విచక్ర వాహన యజమాని తన ట్రాఫిక్ నేరాలకు చేస్తూ పోతే, ఈ చలాన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ చలాన్లు చెల్లించడంలో విఫలం కావడం వల్ల వాహనం యొక్క లైసెన్స్ నిషేధానికి దారితీస్తుంది.

అందువలన, ఇది పూణేలో ప్రస్తుత పరిస్థితికి ఒక పరిష్కారంగా భావించవచ్చు. అయితే, ప్రజలు హెల్మెట్లు ధరించడానికి అంగీకరించడానికి మరియు అది అందించే భద్రతా ప్రయోజనాల గురించి అవగాహన కలిగి ఉంటే మాత్రమే అంతిమ పరిష్కారంగా లభిస్తుంది.

పూణే తేమ వాతావరణం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. హెల్మెట్ని ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత అపారం మరియు ఇది జీవితానికి మరియు మరణానికి మధ్య తేడాను తెలుపుతుంది. తీవ్రమైన తల గాయాలు సాధారణంగా చాలా ద్విచక్ర వాహన ప్రమాద బాధితులు హెల్మెట్లు లేకుండా ప్రయాణించిన వారు, దీనిని అక్కడి ప్రజలు గుర్తించాలి.


Click it and Unblock the Notifications








