Just In
- 9 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 12 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 14 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
1960 లోనే 15 సార్లు కలకత్తా To లండన్ ప్రయాణించిన బస్సు, ఇదే
సాధారణంగా ప్రయాణాలు (జర్నీ) చేయడం చాలామందికి ఇష్టం. అలా అని అందరికి ఇష్టమని కాదు. కొంతమందికి ఒక గంట ప్రయాణం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, విమానాలు మొదలైనవి అందుబాటులో ఉండటం వల్ల ఎక్కడికైనా చాలా వేగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నారు.
కానీ 1960 లలో 'ఆల్బర్ట్' అనే డబుల్ డెక్కర్ బస్సు ఏకంగా ఇండియా నుంచి బ్రిటన్ దాదాపు 15 సార్లు ప్రయాణించింది. లండన్లోని విక్టోరియా కోచ్ స్టేషన్లో ప్రయాణికుల ఈ బస్ ఎక్కుతున్న ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఈ చిత్రంలో, ప్రపంచంలోనే అతి పొడవైన కోచ్ మార్గంలో ప్రయాణికులు లండన్ మరియు కోల్కతా మధ్య ప్రయాణించడం చూడవచ్చు.
ఈ బస్ లో కోల్కతా మరియు లండన్ మధ్య ప్రయాణించడానికి 85 పౌండ్స్ ఛార్జ్ చేయబడుతుంది అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7,889. ఈ రేటు ఆ సమయంలో అత్యంత ఖరీదైనదననే చెప్పవచ్చు. దాదాపు 21 సంవత్సరాలు ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. అయితే తరువాత ఇది అంత సురక్షితమైనది కాదని నిలిపివేయబడింది.
ఈ బస్సును 1968 మే నెలలో ఆండీ స్టీవర్ట్ అనే బ్రిటిష్ ప్రయాణీకుడు కొనుగోలు చేశాడు. స్టీవర్ట్ బస్సును మొబైల్ హోమ్ గా ఉపయోగించుకున్నాడు. అయితే అదే సంవత్సరం అక్టోబర్లో 13 మందితో ఆండీ స్టీవర్ట్ సిడ్నీ నుంచి లండన్కు ఇండియా మీదుగా 16,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఆల్బర్ట్ బస్సు యొక్క మొదటి ప్రయాణం 1968 అక్టోబర్ 8 న సిడ్నీలోని మార్టిన్ ప్లేస్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రారంభమైనట్లు హై రోడ్ ఫర్ ఓజ్ తెలిపింది. ఇది దాదాపు 132 రోజుల తరువాత, 1969 ఫిబ్రవరి 17 న ఇది లండన్ చేరుకుంది.
లండన్, కోల్కతా మరియు సిడ్నీల మధ్య ప్రయాణించడానికి ఆల్బర్ట్ టూర్స్ కోసం ఒక సంవత్సరం షెడ్యూల్ రూపొందించబడింది. హై రోడ్ ఫర్ ఓజ్ ప్రకారం, సిడ్నీ గుండా 4, 5, 6, 7, 8 మరియు 9 సంఖ్యలు ఉన్నాయి. ట్రిప్ నంబర్లు 12, 13, 14 మరియు 15 లండన్ మరియు కోల్కతా మధ్య పనిచేస్తున్నాయి.
భారతదేశానికి చేరుకున్నప్పుడు, ఆల్బర్ట్ బస్సు ఢిల్లీ, ఆగ్రా, బెనారస్ మీదుగా ప్రయాణించి కోల్కతా వద్ద ఆగుతోంది. షెడ్యూల్ ప్రకారం, జూలై 25, 1972 న లండన్ నుండి బయలుదేరిన ప్రయాణికులు 11 జూలై 1972 న కోల్కతాకు చేరుకున్నారు. ప్రయాణికుల ప్రయాణ సమయం 49 రోజులు పట్టింది.
ఈ సుదీర్ఘ ప్రయాణం ప్రయాణికులకు నిజంగా ఒక మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఈ బస్సులో దిగువ డెక్ మీద డైనింగ్ హాల్, ప్రత్యేక స్లీపింగ్ బంక్ మరియు ప్రయాణీకులను వెచ్చగా ఉంచడానికి ఫ్యాన్ హీటర్ వంటి కొన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో అప్పట్లోనే ఏర్పాటుచేయబడ్డాయి.
Image Courtesy: Dr Rohit K Dasgupta/Twitter