జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు
జపాన్లోని పుకుషిమాలో 2011సంవత్సరం అతి పెద్ద అణు విపత్తు జరిగింది. ఇది తీవ్ర పరిణామాలను సృష్టించింది. అంతకు ముందు అంటే 1968 లో కూడా అతి న్యూక్లియర్ ప్లాంట్ అయిన చెర్నోబిల్ లో ఈ అతి పెద్ద అణు విపత్తు సంభవించింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అణు విపత్తులు జరుగుతున్న దేశాలలో జపాన్ ముందుంది.
Also Read: కొత్త కన్వర్టబుల్ మిని కూపర్ కారును ఆవిష్కరించారు.మరి ఇది భారత్కు వస్తుందా ?
అలా ప్రమాదం జరిగిన తరువాత పుకుషిమా నగరం మొత్తం అగ్ని జ్వాలలతో కప్పబడిపోయింది. దీని వలన అత్యధిక రేడియేషన్ విడుదలై సామాన్య ప్రజల మనుగడకు ఎంతో సమస్యగా మారింది. తద్వారా దాదాపుగా 1,60,000 మంది పుకుషిమా నివాసితులను అక్కడ నుండి తరలించారు.
Also Read: సెప్టెంబర్లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 యుటిలిటి వాహనాలు
ప్రస్తుతం పుకుషిమా నగరానికి సంభందించిన మరిన్ని విశేషాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకోండి.

ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు అక్కడి ప్రాంతాన్ని ఫోటోలు తీశారు. అవి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేశాయి. ఆ నిజమైన ఫోటోలలో పక్కనున్న ఫోటో ఒకటి.
Also Read: లీటర్కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్ ఆవిష్కరణ

ఇక్కడ చూడండి దాదాపుగా 20 కిలోమీటర్లు విస్తరించిన ఈ ప్రకృతి అడవి కొన్ని వేల సంఖ్యలో వాహనాలను తన గర్భంలో దాచుకుంది. ఇక్కడ నిలబడి ఉన్న వాహనాలను ఎన్నో తీగలు మరియు పువ్వులు దుప్పటిలా కప్పి పెట్టాయి.
Also Read: లండన్లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు: డిసి అవంతి

ఈ చిత్రంలో ఉన్న వందల వాహనాలను కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్, ఇళ్ళు, పాఠశాలలు, భవనాలు అన్నీ పంచుకున్నాయి.
Also Read: రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్న జపాన్ !

పుకుషిమా అణు ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద మొత్తంలో రేడియేషన్ బయటకు వికిరణం జరిగినది. తద్వారా అక్కడి ప్రజలు అందరూ ఆ ప్రాంతాన్ని వదిలి వెంటనే కదిలి వెళ్లారు.
Also Read: వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్.......

2011 సంవత్సరం మార్చి 11 న వచ్చిన అతి పెద్ద సునామి భూకంపానికి కారణం అయ్యింది. దీని వలన 50 అడుగుల ఎత్తులో ఉన్న పుకుషిమా అణు ప్లాంట్ను కూల్చివేసింది. ఆ తరువాత అత్యంత శక్తివంతమైన ఈ న్యూక్లియర ప్లాంట్ అతి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది.
Also Read: మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాల కోసం క్లిక్ చేయండి.

ప్రమాదం సంభవించి ప్రస్తుతానికి నాలుగు సంవత్సారాలు అయ్యింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూసిన వారు ఎవరూ భయపడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతాన్నికొన్ని డజన్ల సంఖ్యలో మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఆక్రమించుకున్నాయి.

గణాంకాల ప్రకారం దాదాపుగా 1,60,000 మందిని తరలించినట్లు సమాచారం. అందులో 1,20,000 మంది నివాసితులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికి అక్కడ కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయని సమాచారం.

ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ Arkadiusz Podniesinski polendna ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ఫోటోలను తన కెమెరాలు బందించాడు. ఈ ఫోటోలను చూసి ప్రపంచం మొత్తం నిర్ఘాంత పోయింది.

43 ఏళ్ళ వయస్సున్న వృద్ద ఫోటో గ్రాఫర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ప్రాంతం యొక్క నిజమైన చిత్రాల్ని స్వయంగా చిత్రీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు.

అయితే జపాన్ అధికారులు ఈ ప్రాంతాన్ని ఏ మాత్రం వదులుకోలేదు. దీని శుభ్రతకు శ్రీకారం చుట్టారు. దాదాపుగా 20,000 మంది కార్మికుల్ని ఈ స్థల పునరుద్దరణ కొరకు నియమించుకొన్నారు.


Click it and Unblock the Notifications








