బయోఫ్యూయల్స్ పై అపోహలు, వాస్తవాలు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ?

భారతదేశం పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన భవిష్యత్తు కోసం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను చేరుకోవడానికి బయోఫ్యూయల్స్, సహజ వాయువు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేస్తాయి.

నీతి ఆయోగ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఇథనాల్ వాడకం వల్ల పెట్రోల్‌తో పోలిస్తే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ ఇంధన మార్పు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు ఎలా ప్రయోజనం చేకూరుతోందో, దీనిపై ఉన్న అపోహలకు ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తోందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

E-20 Ethanol Blending Debunking the Myths and Sharing the Facts

బయోఫ్యూయల్స్ వాడకం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది పర్యావరణానికి మేలు చేయడం, రెండవది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. ఇథనాల్ వాడకం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

చెరకు, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడకం వల్ల పెట్రోల్‌తో పోలిస్తే వరుసగా 65%, 50% తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయి. గత 11 సంవత్సరాల్లో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలు తగ్గాయి. ఇది 30 కోట్ల మొక్కలు నాటిన దానికి సమానం.

E-20 Ethanol Blending Debunking the Myths and Sharing the Facts

ఈ కార్యక్రమం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గతంలో ముడి చమురు దిగుమతులపై ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు రైతులకు వెళుతోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. ముఖ్యంగా, చెరకు రైతులకు బకాయిలు తొలగిపోయాయి. మొక్కజొన్న సాగు కూడా లాభదాయకంగా మారింది. ఈథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా రైతులు అన్నదాతలే కాకుండా ఊర్జదాత(శక్తినిచ్చేవాళ్ళు)గా మారారు.

గతంలో విదర్భ వంటి ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. అలాంటి సమస్యలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఈ ఏడాది 20% బ్లెండింగ్ ద్వారా రైతులకు సుమారు రూ.40,000 కోట్లు, విదేశీ మారక నిల్వలలో రూ.43,000 కోట్లు ఆదా అవుతాయని అంచనా.

E-20 Ethanol Blending Debunking the Myths and Sharing the Facts

పెట్రోల్, ఇథనాల్ బ్లెండింగ్ పై అపోహలు, వాస్తవాలు
మైలేజ్, పనితీరు: కొంతమంది E-20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందని, ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని అపోహ పడుతున్నారు. కానీ 2020లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించింది. IOCL, ARAI, SIAM వంటి సంస్థలు కూడా పరిశోధనలు చేశాయి.

E-20 ఇంధనం వల్ల యాక్సిలరేషన్, మంచి రైడ్ క్వాలిటీ, సుమారు 30% తక్కువ కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయి. ఇథనాల్ ఆక్టేన్ నంబర్ (108.5) పెట్రోల్ (84.4) కంటే ఎక్కువగా ఉండటం వల్ల లేటెస్ట్ ఇంజిన్‌లలో పనితీరు మరింత మెరుగుపడుతుంది.

పాత వాహనాల అనుకూలత: పాత వాహనాలకు E-20 ఇంధనం వాడటం వల్ల సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. వాస్తవానికి, పాత వాహనాల్లో కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు త్వరగా మార్చాల్సి రావచ్చు. అయితే, ఈ మార్పులు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఒక వాహనం జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఇలాంటి మార్పు అవసరం కావచ్చు.

అధీకృత సర్వీస్ స్టేషన్లలో ఈ మార్పులు సులభంగా చేయించుకోవచ్చు. బ్రెజిల్ వంటి దేశాలు సంవత్సరాలుగా E-27 ఇంధనాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. అక్కడి టయోటా, హోండా, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఎలాంటి సమస్యలు లేకుండా వాహనాలను తయారు చేస్తున్నాయి.

ధర, ఆర్థిక ప్రయోజనాలు: ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ధర తక్కువ ఉండాలని, కానీ ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరడం లేదని కొందరు వాదిస్తున్నారు. 2020-21లో నీతి ఆయోగ్ నివేదిక సిద్ధం చేసే సమయంలో ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉండేది.

కానీ ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తి వ్యయం పెరిగింది. అయినా సరే, ఇంధన భద్రత, రైతు ఆదాయం, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ కంపెనీలు ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇన్సూరెన్స్, సేఫ్టీ : E-20 ఇంధనం వాడితే వాహనాల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. E-20 ఇంధనం వాడకం వల్ల వాహనాల ఇన్సూరెన్స్ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదు. పుకార్లను సృష్టించడం కోసం కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీల ట్వీట్లను తప్పుగా వ్యాఖ్యానించాయి.

వాహనాల భద్రతా ప్రమాణాలకు సంబంధించి BIS, ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పూర్తిగా నిర్దేశించబడ్డాయి. డ్రైవబిలిటీ, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ అనుకూలత వంటి అన్ని అంశాలలో ఎలాంటి సమస్యలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భవిష్యత్తు ప్రణాళిక: ప్రభుత్వం E-20 దాటి వెళ్లడానికి ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బ్రెజిల్‌లో ఉన్న వాహన తయారీ సంస్థలు, ముడి పదార్థాల సరఫరాదారులు, R&D ఏజెన్సీలు, ఆయిల్ కంపెనీలు, ఇథనాల్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ 31 వరకు E-20 కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలను అన్ని వర్గాల అభిప్రాయాలు, నిపుణుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం తీసుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2025, 11:56 [IST]
English summary
E 20 ethanol blending debunking the myths and sharing the facts
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+