జూలై 31 తర్వాత ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొంటే సబ్సిడీ రాదు.. కారణం ఇదే!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 'ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024 జూలై 31తో ముగియనుంది. ఏప్రిల్‌లో ఈ పథకానికి సుమారు రూ. 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడం ఈ పథకం లక్ష్యం. అయితే తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి ఎటువంటి బడ్జెట్‌ కేటాయించలేదు. దీంతో ఈ పథకం కనుమరుగైనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు లక్షల సంఖ్యలో వాహనాలకు లబ్ది చేకూరింది. అలాంటి ప్రాజెక్టు త్వరలోనే రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకోగా, గడువులోగా నిధులు ఉన్నాకానీ జూలై 31 లోపు ప్రాజెక్టును నిలిపివేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.

Electric-Mobility-Promotion-Scheme-Ends

ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నిధులు అయిపోయే వరకు లేదా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే క్లెయిమ్లను ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సబ్సిడీని ప్రోత్సాహకాలను అందించింది.

అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. పన్ను మినహాయింపులు, సబ్సిడీలతో సహా రాయితీలు ఇస్తున్నారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బడ్జెట్‌లో 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామణ్‌ తెలిపారు.

Union-Budget-Removed-Customs-Duty-On-Lithium

ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే లిథియం, కోబాల్ట్‌ తక్కువ ధరకు ఉత్పత్తి కంపెనీలకు లభించనుంది. ఇదొక ఊరటే అని చెప్పాలి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న లిథియం-అయాన్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరల్లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

ప్రస్తుతం భారత్‌లో చాలా బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలు లిథియం అయాన్ ఖనిజాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లిథియం అయాన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతం, ఐ-జీఎస్టీ 18 శాతం, ఇతర ఛార్జీల పేరుతో 10 శాతం వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా, ల్యాండింగ్ ఛార్జీగా అదనంగా 1 శాతం పన్ను వసూలు చేయబడుతుంది.

దీనివల్ల దేశంలో రూ.100 విలువైన లిథియం కు రూ.49 మాత్రమే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ దశలోనే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. దీంతో బ్యాటరీ ప్యాక్ ధర గణనీయంగా తగ్గనుంది. అదేవిధంగా, ప్రస్తుత ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ స్కీమ్ పూర్తయిన వెంటనే, ప్రభుత్వం దీనిని పునరుద్ధరించి కొత్తగా మరో పథకాన్ని ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనలు వెలువడుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహన ప్రియులే కాదు.. ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు కూడా ఆ ప్రకటనపైనే ఆశలు పెట్టుకున్నారు. దీనిపై బడ్జెట్‌లో ప్రకటిస్తే వారికి ఇంకా ధైర్యం ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే ఈ రంగాన్ని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2024, 7:20 [IST]
English summary
Electric mobility promotion scheme ends by july 31 here what will happen next
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+