Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?
భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా ప్రబలుతోంది. ఈ మహామ్మారి భారిన పడి ఇప్పటికే చాలామంది మ్యుత్యువాత పడ్డారు. కొంతమంది సరైన వసతులు లేకుండా మరణిస్తుంటే మరికొందరు ఆక్సిజన్ అందకుండా మరణిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కరోనా తీవ్రత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువగా ఉంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హృదయ విషాద గాథ చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన గౌడ చెంచులు అనే మహిళ జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా, హాస్పిటల్ కి తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు.
అయితే కరోనా టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. కరోనా టెస్ట్ చేసిన తర్వాత ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయనే విషయంపై కూడా ఫిర్యాదులున్నాయి. అయితే గౌడ చెంచులు కరోనా టెస్ట్ ఫలితాలు రాకముందే కన్ను మూసింది.
MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?
మహిళా మృతిచెందిన వెంటనే అక్కడ ఉన్న అంబులెన్సుల కోసం చుస్తే అందుబాటులో లేదు, ఆటోలో అయినా తీసుకెళ్లాలనుకుంటే ఆ మహిళ కరోనా వల్ల మరణించిందని ఆటో వాళ్ళు రావడానికి ఒప్పుకోలేదు. మహిళా మృతదేహంతో చాలా సేపు వేచి చూసిన తర్వాత కూడా వాహనాలు అందుబాటులో లేదు.
గౌడ చెంచులు కొడుకు మరియు అల్లుడు ఇంక చేసేది ఏమి లేక తమ ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించారు, అయితే ఇదే సమయంలో ట్రిపుల్ రైడింగ్ లో పోలీసులు తనికీ చేశారు. తనకీ సమయంలో అసలు విషయం తెలుసుకున్న దిగ్బ్రాంతి చెందారు.
MOST READ:కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న కొత్త సొనెట్ & సెల్టోస్
ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కరోనా బారినపడి మృతి చెందిన ఓ వ్యక్తి కుమారుడు తన తండ్రి మృతదేహాన్ని కారుపై కట్టి స్మశానానికి తరలించిన సంఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అంబులెన్స్ దొరకక అమన్ అనే వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని తన కారుపై టాప్ మీద కట్టి అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకెళ్ళాడు.
కరోనా మహమ్మరి వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చాలా అంబులెన్సులు ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే, వారి అవసరం ఇప్పుడు ప్రజలకు చాలా ఉంది.
MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు
ప్రభుత్వ అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయివేట్ అంబులెన్సుల డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన బెంగరూరులో వెలుగులోకి వచ్చింది. తండ్రి మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి మహిళ వద్ద 60,000 రూపాయలు డిమాండ్ చేసాడు.
ఏది ఏమైనా ఇలాంటి హృదయ విషాద గాథలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలి. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత స్మశానానికి తీసుకెళ్లడానికి కూడా సరైన సదుపాయాలు లేకపోవడం నిజంగా అమానుషం.
MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?
NOTE; ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే