Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
చాలామంది బైక్ రైడర్స్ సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి చాలా ఇష్టపడతారు. ఈ సందర్భాలలో రైడర్స్ దేశాలు మరియు ఖండాలు కూడా దాటిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఈ లాంగ్ డ్రైవ్స్ సాహసోపేతం మాత్రమే కాదు ప్రమాదం కూడా, ఒక్కొక్కసారి ఈ లాంగ్ డ్రైవ్స్ ప్రాణాంతకం కూడా. ఈ విధంగా లాంగ్ డ్రైవ్స్ చేసే బెంగళూరుకు చెందిన శ్రీనివాసన్ ఇటీవల ప్రమాదంలో మరణించారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..
బెంగళూరుకి చెందిన ప్రసిద్ధ బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రయాణిస్తున్నప్పుడు శ్రీనివాసన్ బైక్ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ స్నేహితులతో బైక్ ట్రిప్ వెళ్ళాడు. జైసల్మేర్లో ప్రయాణిస్తున్నప్పుడు, శ్రీనివాసన్ ముందు వెళ్తుండగా, అతని మిగిలిన స్నేహితులు వెనుక వస్తున్నారు. అకస్మాత్తుగా తన బైక్ కి ఒంటె అడ్డు రావడంతో కింద పడిపోయారు. శ్రీనివాసన్ కిందపడటం వల్ల తలకు బలమైన గాయాలు అవ్వడంతో, వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు
శ్రీనివాసన్ తలకు దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన మరణించినట్లు రాజస్థాన్ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. శ్రీనివాసన్ పార్థివ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత రాజస్థాన్ పోలీసుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రిచర్డ్ శ్రీనివాస్తో కలిసి బెంగళూరుకు చెందిన డాక్టర్ నారాయణ విజయ్, వేణుగోపాల్ ఈ లాంగ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. వారి పర్యటన జనవరి 23 న బెంగళూరులో ముగియనున్నట్లు ఆయన తెలిపారు. కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ గతంలో బెంగళూరు నుండి ట్రయంఫ్ టైగర్ బైక్ మీద ప్రయాణించి ఆసియా, యూరప్, అమెరికా మరియు ఆస్టెలియా ఖండాల చుట్టూ పర్యటించారు.
MOST READ:బైక్ రైడర్కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే
రిచర్డ్ శ్రీనివాస్ ఇటీవలే రైడ్ కోసం లగ్జరీ బిఎమ్డబ్ల్యూ జిఎస్ బైక్ను కూడా కొనుగోలు చేశాడు. ఎందుకంటే అతను ఈ రైడింగ్ ముగించిన తరువాత ఆఫ్రికాకు బైక్ యాత్ర చేయాలని కూడా అనుకున్నాడు.
ట్రయంఫ్ టైగర్ 800 బైక్ 800 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 9,500 ఆర్పిఎమ్ వద్ద 93.7 బిహెచ్పి శక్తిని, 8,050 ఆర్పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులు లాంగ్ డ్రైవ్ లో వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
MOST READ:షూటింగ్ స్పాట్కి 12 కి.మీ సైకిల్పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
బైక్ రైడర్ రిచర్డ్ శ్రీనివాస్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకర్లలో ఒకరు. అత్యంత కష్టతరమైన రహదారులలో ప్రయాణించి దేశాలను శాతం చుట్టి వచ్చిన గొప్ప బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ ఇప్పుడు బైక్ ప్రమాదంలో మరణించడం నిజంగా ఒక విషాదకరం.
Image Courtesy: King Richard/Instagram