ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మరి చాలామంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ కరోనా వైరస్ కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కరోనా మహమ్మరి నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించారు. ఈ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది ఇంటివద్ద ఉంటూ కాలక్షేపం చేస్తే, ఇంకొంతమంది వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీశారు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

కరోనా లాక్ డౌన్ లో వెలువడిన చాలా అద్భుతమైన విషయాలను గురించి ఇదివరకటి కథనాలతో చర్చించాం. ఇప్పుడే అదే రీతిలో ఒక రైతు ఏకంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసాడు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

ఎంత కష్టకాలం వచ్చినా నిరంతరం పనిచేసే వాడు ఒక్క రైతు మాత్రమే, లాక్ డౌన్ సమయంలో ఒడిషాలోని మయూర్భంగ్ జిల్లా, కరంజియా సబ్ డివిజన్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ అనే రైతు పెట్రోల్ మరియు డీజిల్ అవసరం లేని ఒక వాహనాన్ని తయారుచేసాడు. ఈ వాహనం సోలార్ ద్వారా నడుస్తుంది.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

వాహనాన్ని సోలార్ ప్యానెల్ మరియు ఛార్జింగ్ పాయింట్ ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ మరియు పుస్తకాలలో లభించే సమాచారం ఆధారంగా ఈ వాహనం అభివృద్ధి చేయబడిందని ఆ రైతు చెప్పాడు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

సుశీల్ అగర్వాల్ ఉండే ప్రాంతంలో న్యూ ఐడియాస్ ఇన్వెన్షన్‌పై వర్క్‌షాప్ జరిగింది. అందులో పాల్గొన్న అతడు, అక్కడ పరిచయమైన మెకానిక్స్ సాయంతో వెహికల్‌ తయారుచేయడం మొదలుపెట్టాడు. 850 వాట్ల మోటార్‌తో పాటు 54 వోల్ట్‌ల బ్యాటరీ, ఇతర పార్ట్స్ ఒక్కొక్కటిగా అసెంబుల్ చేస్తూ వచ్చాడు. మొత్తం 8 నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు వెహికల్ రూపొందించాడు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత వాహనం 300 కిలోమీటర్ల దూరం నడుస్తుందని అతడు తెలిపాడు. దీని బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయడానికి 8.30 గంటలు పడుతుందని తెలిపాడు. మన్నికైన బ్యాటరీ ఈ వాహనంలో చాలా కాలంగా ఉపయోగించబడింది. బ్యాటరీ 10 సంవత్సరాలు ఉంటుందని ఆయన అన్నారు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

ఈ వాహనానికి అవసరమైన ఉపకరణాలు కూడా వారే రూపొందించారు. అతను అన్ని రకాల పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగులు మరియు ఇతర ముఖ్యమైన వాటిని కూడా వారే తయారుచేసుకున్న. ఈ వాహనాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వారు రైతు మాత్రమే కాదు, చురుకైన వ్యక్తి కూడా అని నిరూపించారు.

ఒక చార్జితో 300 కిమీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

ఒక రైతు చేసిన ఈ అద్భుతమైన వాహనాన్ని చూసిన, ఆర్టీఓ అధికారులు వారి ఆవిష్కరణను చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా యీతని సృష్టి అనన్య సామాన్యం. దీనిపై ఆర్టీఓ అధికారి మయూరభంజ్ గోపాల్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత కాలానికి పర్యావరణ అనుకూలమైన వాహనాలు అవసరం కావున, ఇది చాలాబాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ANI న్యూస్‌ ఛానల్ కి ఆ రైతు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీని సంబంధించిన మొత్తం సమాచారం ఉంది.

NOTE : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు రిఫరెన్స్ కోసం మాత్రమే

More from DriveSpark

Article Published On: Tuesday, March 16, 2021, 12:50 [IST]
English summary
Farmer From Odisha Develops Solar Vehicle During Lockdown. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+