Just In
- 19 min ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 2 hrs ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 2 hrs ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
- 16 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
Don't Miss
- Finance IPO News: ఒక్క నిమిషంలో డబ్బును డబుల్ చేసిన ఐపీవో.. తొలిరోజే లాభాల తుఫాను..
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అవమానించిన సేల్స్మ్యాన్కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
సాధారణంగా
మనిషి
యొక్క
వేషాన్ని
చూసి
తక్కువ
అంచనా
వేయడం
చాలా
పొరపాటు.
కొంతమంది
సాదాసీదాగా
కనిపించే
వారిని
హేళన
చేస్తూ
ఉంటారు.
ఇలాంటి
సంఘటన
ఇటీవల
కర్ణాటక
రాజధాని
నగరం
బెంగళూరులో
జరిగింది.
దీని
గురించి
పూర్తి
సమాచారం
ఈ
ఆర్టికల్
లో
తెలుసుకుందాం..
రండి.
కర్ణాటకలో తుమకూరు ప్రాంతానికి చెందిన కెంపెగౌడ అనే రైతు తుమకూరులోని మహీంద్రా షోరూమ్కి తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. అయితే వారి వేషాలను చూసిన అక్కడి షోరూమ్ లోని ఒక సేల్స్మేన్ వారిని ఎంతగానో అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆ సేల్స్మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని, కనీసం మీ జేబులో 10 రూపాయలు కూడా ఉండవని ఎగతాళి చేసాడు.
సేల్స్మేన్ వారికి బలవంతంగా ఆ షోరూమ్ నుంచి బయటకు పంపించేశాడు. ఆ సేల్స్మేన్ మతాలకు బాధపడిన ఆ రైతు కేవలం ఒక గంట వ్యవధిలోనే రూ. 10 లక్షలు తీసుకువచ్చి, మహీంద్రా బొలెరో (Mahindra Bolero) డెలివరీ చేయమని చెప్పాడు. ఇది చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.
అయితే అక్కడ మహీంద్రా బొలెరో ప్రస్తుతానికి లేదని కనీసం నాలుగురోజులు వ్యవధి కావాలని అక్కడి వారు చెప్పారు. ఆ మాటలకూ చిర్రెత్తిన ఆ రైతు ఒక్కసారిగా వారిపైన మండిపడ్డాడు. ఆ సేల్స్మేన్ మీదికి గొడవకు దిగాడు. ఈ సంఘటనతో అక్కడ మొత్తం గొడవ వాతావరణం ఏర్పడింది. అందరూ ఆ రైతుని సర్ది చెప్పడానికి చూసారు.
రైతు కెంపెగౌడ ఆ సేల్స్మేన్ పై మండిపడటమే కాకుండా అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది.
దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో 'ఆనంద్ మహీంద్రా' ను ట్యాగ్ చేస్తూ అప్లోడ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది. అయితే చివరకు ఆ రైతు ఇంతగా అవమానించిన ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కార్ షోరూమ్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రైతు కెంపెగౌడ విషయానికి వస్తే, యితడు కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. తుమకూరు జిల్లాలో కావాల్సిన నీరు అందుబాటులో ఉండటంతో అక్కడి రైతులు సంవత్సరం మొత్తం వ్యవసాయం చేస్తుంటారు. కావున ఇక్కడ రైతులు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు.
ఏది ఏమైనా షోరూమ్ కి వచ్చిన కస్టమర్లను అవమానించడం చాలా తప్పు, అంతే కాకూండా ఈ మనిషిని తన ఆహార్యాన్ని బట్టి అంచనావేయకూడదు. సాధారణంగా భారతదేశంలో చాలామంది రైతులు చాలా సాధారణంగా ఉంటారు. ఈ విషయం అందరికి తెలుసు. దీనిపైన మన ఆనంద్ మహీంద్రా గారు ఎలా స్పందిస్తారనేది త్వరలో తెలుస్తుంది.