బైకర్లకు బ్యాడ్ న్యూస్? జూలై 15 నుంచి బైక్‌లకు ఫాస్టాగ్ తప్పనిసరి?

భారతదేశంలో బైక్‌లపై ప్రయాణించే వారికి నిజంగా షాకింగ్ న్యూస్. హైవేలపై టూ వీలర్లకు ఇక మీదట టోల్ చెల్లించాలని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 15, 2025 నుంచి బైక్‌లు కూడా టోల్ చెల్లించాల్సి ఉంటుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు బైక్‌లకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కానీ, అది త్వరలో ముగిసిపోవచ్చు అంటున్నారు.

అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా టూ వీలర్లను కూడా ఫాస్టాగ్ టోల్ వసూలు సిస్టమ్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ మార్పు భారతదేశంలో రోజువారీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయొచ్చు.

Toll Plaza

టూ వీలర్లకు ఫాస్టాగ్ ఫ్రీ పాస్ ముగియడం వెనుక కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే డిజిటల్ టోల్ వసూలు విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటివరకు కార్లు, వాణిజ్య వాహనాలు మాత్రమే ఈ విధానంలో ఉన్నాయి. భారతదేశంలో రోడ్డుపై ప్రయాణించే వాహనాల్లో ద్విచక్ర వాహనాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

రోడ్ల నిర్వహణ ఖర్చును అందరి నుంచీ వసూలు చేయడానికి, బైక్‌లను కూడా ఫాస్టాగ్ పరిధిలోకి తీసుకురావడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రోడ్డు అప్‌గ్రేడ్‌లు, మరమ్మతులు, విస్తరణ కోసం అదనపు ఆదాయం కూడా వస్తుంది.

Toll Plaza

ఒకవేళ బైక్‌లకు ఫాస్టాగ్ తప్పనిసరి అయితే, టూవీలర్ల యజమానులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక ఫాస్టాగ్ కొనుక్కోవాలి. దాన్ని తమ బ్యాంక్ ఖాతాకు లేదా ఏదైనా డిజిటల్ వాలెట్‌కు లింక్ చేయాలి. టోల్ చెల్లింపులు సజావుగా జరగడానికి ఆ ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాలి. దీనివల్ల టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా వేగంగా వెళ్లిపోవచ్చు. చేతిలో డబ్బులు లేకపోయినా, టెన్షన్ పడకుండా నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయొచ్చు.

దీని వల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ఇది చాలామందికి భారం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు తెలియని వారికి ఇది కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. టోల్ వసూలు వల్ల లక్షలాది మంది ద్విచక్ర వాహనదారులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పట్టణాల బయట, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది.

చాలా మంది తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి బైక్‌లు, స్కూటర్లపై ఆధారపడతారు. టోల్ ఫీజు రావడం వల్ల వారి నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరగొచ్చు. అంతేకాకుండా, దీనివల్ల టూ వీలర్ల అమ్మకాలపై కూడా ప్రభావం పడవచ్చు. వాహనం కొనుగోలు ఖర్చు పెరిగితే, కొత్తగా కొనాలనుకునే వారు తమ రవాణా ఆప్షన్లను మళ్లీ ఆలోచించుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ధర సెగ్మెంట్ వాహనాలకు ఇది వర్తిస్తుంది.

ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలు ఫోర్-వీలర్ల కంటే తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఎందుకంటే, అవి రోడ్డుకు తక్కువ నష్టం కలిగిస్తాయి. అయితే, రేట్లు వీటిపై ఆధారపడి మారొచ్చు. అది నేషనల్ హైవేనా లేదా స్టేట్ హైవేనా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. టోల్ వసూలు చేసే ఏజెన్సీని బట్టి రేట్లు మారొచ్చు. ఎంత దూరం ప్రయాణించారు అన్నదానిపై కూడా టోల్ ఆధారపడి ఉండొచ్చు.

తరచుగా ద్విచక్ర వాహనాలను ఉపయోగించే వారి కోసం వార్షిక పాస్ మోడల్‌లు వంటివి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ 2025. పెరిగిన టోల్ ఖర్చులు ఎక్కువ మంది డ్రైవర్లను ఎలక్ట్రిక్ టూ వీలర్ల వైపు మళ్లించవచ్చు. ఎందుకంటే, కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంది.

ద్విచక్ర వాహనాలకు ఫాస్టాగ్ ఫ్రీ పాస్ త్వరలో చరిత్రలో కలిసిపోవచ్చు. జూలై 15 దగ్గరపడుతున్న కొద్దీ ద్విచక్ర వాహనదారులు ఇతర వాహనాల మాదిరిగానే హైవేలపై టోల్ చెల్లిస్తారా లేదా అనేది తెలియాలి. ఇది క్రమంగా అమలు చేయబడినా, ఒకటి మాత్రం ఖాయం : భారతదేశం టోల్ సిస్టమ్ పూర్తిగా డిజిటల్ వైపు కదులుతోంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఈ మార్పు బైకర్లకు ఆర్థికంగా కొంత భారం అయినప్పటికీ, దేశవ్యాప్తంగా టోల్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడానికి ఇది సహాయపడుతుంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం బైకర్లకు ఎలాంటి లాభాలు, నష్టాలు కలిగిస్తుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2025, 14:57 [IST]
English summary
Fastag likely mandatory for two wheelers on indian highways from july 15
Read more on: #india #auto news #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+