భారత్లో అమ్మకానికి రూ.1.25 కోట్ల విలువ చేసే ఫెరారీ బుక్

అంతేకాదండోయే.. వేగానికి చిహ్నమైన గుర్రాన్ని (ఫెరారీ లోగో) 30 క్యారెట్ల డైమండ్లతోనూ, 1,500 విశిష్టమైన రాళ్లతో తయారు చేయబడింది. ఈ లోగో పుస్తకం ముఖభాగంలో ఉంటుంది. ఈ పుస్తకం బరువు 37 కిలోలు. ఫెరారీ ఇండియా మరియు ఓపస్ మీడియా గ్రూప్లు భారతదేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాయి. దేశంలోనే అత్యంత ఖరీదనై పుస్తకాలలో ఇది కూడా ఒకటి.
ఈ పుస్తకం వెల 2,50,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.1.25 కోట్లకు పైగా)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పుస్తకాలు ఒక్కో దేశంలో ఒకటి చొప్పును మాత్రమే ఫెరారీ విక్రయిస్తోంది. ఈ ఫెరారీ పుస్తకాన్ని చేతితో తయారు చేసిన ఓ నల్లటి కార్బన్ ఫైబర్ కేస్లో అందజేస్తారు. ఇందులో మూడు సంతకాల షీట్లు ఉంటాయి, వీటిపై ప్రస్తుత ఫెరారీ డ్రైవర్ల సంతకంతో పాటుగా, మాజీ ప్రపంచ ఛాంపియన్ల సంతకాలు కూడా ఉంటాయి.
మొత్తం 852 పేజీలున్న ఈ పుస్తకంలో రెండు లక్షల పదాలతో గతంలో ఎప్పుడూ ప్రచురితం కాని 2,000 ఫొటోలను పొందుపరిచారు. ఇప్పటికే ఈ పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ముగ్గురు భారతీయులు పోటీపడుతున్నారని, మరికొద్ది గంటల్లోనే ఈ పుస్తకాన్ని ఎవరికి విక్రయించే విషయాన్ని వెల్లడిస్తామని ఓపస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్ల్ ఫోలర్ తెలిపారు.


Click it and Unblock the Notifications








