Just In
- 55 min ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 2 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 3 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Movies స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్లో జడ్జిలు!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బిపిన్ రావత్ మరణానికి కారణమైన Mi17 V5 హెలికాప్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు
ఈ రోజు యావత్ భారతదేశం మొత్తం వినిపిస్తున్న పేరు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ 'బిపిన్ రావత్'. భారతసైన్యంలో అలుపెరుగక సేవలందించి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశ రక్షణలో ప్రధాన పాత్రవహిస్తున్న రావత్ గతంలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో అసువులు బాసారు.
దేశ భద్రతా దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న Mi17 V5 ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆయన భార్య మరియు బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది చనిపోయారు. ఈ ఘటన దేశాన్ని చలింపజేసింది.
బ్రిగేడియర్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సైనిక సిబ్బందితో కూడిన హెలికాప్టర్ నేలకూలింది. ఈ ప్రమాదం తరువాత తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో బిపిన్ రావత్ చనిపోయాడు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. వాతావారణ పరిస్థితులు సరిగ్గా లేకపోడం వల్ల విమానం కూలిందా.. లేదా చెట్ల వల్ల కూలిందా లేకుంటే ఈ హెలికాఫ్టర్ ఇంజిన్ లో ఏదైనా సమస్య వల్ల కూలిందా అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏది ఈరి మరణానికి కారణమో అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దేశంలోని అత్యున్నత స్థాయి సైనిక కమాండర్ బిపిన్ రావత్ ప్రయాణించేందుకు Mi17 V5 హెలికాప్టర్ ఉపయోగించబడింది. ఈ హెలికాప్టర్ను రష్యాలో తయారు చేయబడింది. రష్యన్ హెలికాప్టర్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేసే కజాన్ హెలికాప్టర్ కంపెనీ ఈ హెలికాప్టర్ను తయారు చేసింది.
ఈ హెలికాప్టర్ సైనిక సిబ్బందిని, సాయుధ బలగాలను మరియు ప్రధాన లాజిస్టిక్లను రవాణా చేయడానికి ఉపయోగించబడుతుంది. అంతే కాకూండా VVIP ల రక్షణ మరియు రెస్క్యూ కార్యకలాపాలకు కూడా ఉపయోగించబడుతుంది. రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్ను 1977లో ప్రవేశపెట్టారు.
ఈ హెలికాప్టర్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉంది. ఈ నేపథ్యంలో, ఈ హెలికాప్టర్ అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణించబడుతుంది. 2008 లో రష్యా నుంచి 80 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. అయితే 2013 నాటికి 36 హెలికాప్టర్లను భారత్కు అప్పగించారు. చాలా హెలికాప్టర్లు జూలై 2018 లో భారతదేశానికి డెలివరీ చేయబడ్డాయి.
దీనికి సంబంధించి భారత వైమానిక దళం 2019లో ప్రత్యేక వర్క్షాప్ను ప్రారంభించింది. అందువల్ల ఈ హెలికాప్టర్ అధిక నిర్వహణలో ఉంచబడిందని చెప్పవచ్చు. అయితే గత 8 ఏళ్లలో ఈ హెలికాప్టర్లు 6 సార్లు కూలిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ హెలికాప్టర్లను అత్యంత జాగ్రత్తగా నడుపుతారు.ఈ హెలికాప్టర్ గరిష్టంగా 13,000 కిలోల బరువుతో ప్రయాణించగలదు. ఈ హెలికాప్టర్ గరిష్టంగా 36 మంది సైనికులు లేదా 4,500 కిలోల బరువును మోసుకెళ్లగలదు.
ఈ హెలికాప్టర్లో అధునాతన నియంత్రణ పరికరాలను అమర్చారు. హెలికాప్టర్లో రాత్రి సమయ ప్రయాణం, వాతావరణ అంచనా మరియు ఆటో పైలట్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ హెలికాఫ్టర్లు కూలిపోయాడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం.
భారత వైమానిక దళంలో ఉన్న Mi17 V5 హెలికాప్టర్లో మెషిన్ గన్లతో సహా రక్షణ లేదా ప్రమాదకర ఉపయోగం కోసం ఆయుధాలు ఉన్నాయి. బహుళ వినియోగానికి ఇది ఉత్తమ హెలికాప్టర్ మోడల్గా పరిగణించబడుతుంది. ఈ హెలికాప్టర్లోని ఇంధన ట్యాంకులు పేలుడు ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక ఫోమ్ పాలియురేతేన్ కోటింగ్తో అందించబడ్డాయి.
Mi17 V5 హెలికాప్టర్ గంటకు 250 కిమీ వేగంతో ప్రయాణించగలదు. పూర్తిగా లోడ్ చేసుకున్న ఇంధన ట్యాంక్ తో ఈ హెలికాప్టర్ 580 కి.మీ వరకు ప్రయాణించగలదు. అదనపు ఇంధన ట్యాంకులతో ఇది 1,065 కి.మీ వరకు ప్రయాణింవచ్చు. ఈ హెలికాప్టర్ 6,000 అడుగుల వరకు ప్రయాణించగలదు.
Mi17 V5 హెలికాప్టర్ పైన ఉన్న అధిక విశ్వసనీయ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలలో వీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే భారత సాయుధ దళాల చీఫ్ బిపిన్ రావత్ నేతృత్వంలోని హెలికాప్టర్ కుప్పకూలడం అనేది ఊహించని పరిణామం, ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని వివిధ రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హెలికాప్టర్లోని బ్లాక్బాక్స్ను గుర్తించి తనిఖీ చేస్తే ప్రమాదానికి గల కారణాలపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది విచారణ తర్వాత మాత్రమే. బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఇతర సైనిక సిబ్బంది మృతి పట్ల ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకూండా వీరి మృతి పట్ల పాకిస్థాన్ సహా పలు దేశాలకు చెందిన ఆర్మీ చీఫ్లు సంతాపం తెలిపారు.