జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

పోలీస్ స్టేషన్లకు ఎలక్ట్రిక్ సప్లై కట్ చేసినందుకు గాను తెలంగాణ స్టేట్ సదరన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి రమేష్ అరెస్టయ్యాడు. పోలీస్ స్టేషన్ కి కరెంట్ ఎందుకు కట్ చేసాడు, పోలీసులు అతనిని ఎదుకు అరెస్ట్ చేశారన్న విషయాన్నీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

నివేదికల ప్రకారం రమేష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో కోపోద్రేకుడైన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ కి కరెంట్ కట్ చేసాడు. ఈ సంఘటన తరువాత రమేష్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ బైక్‌ను ఒక బాలుడు రైడ్ చేసాడు. సాధారణంగా వాహన చట్టం ప్రకారం మైనర్లు బైక్ నడపడానికి అనర్హుడు. ఈ కారణంగా రమేష్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

అతనికి జరిమానా విధించిన వెంటనే రమేష్ ఘటనా స్థలానికి వెళ్లి విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ ఉల్లంఘన యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ పోలీసులకు అతనికి జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

సంఘటన స్థలం నుండి వెళ్లిన రమేష్, పోలీస్ స్టేషన్లకు కరెంట్ కట్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం, జుడిమట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్లకు కరెంట్ కట్ చేసాడు. కరెంట్ కట్ అవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ లో కొంత ఇబ్బందికార వాతావరణం ఏర్పడింది.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

ఇంతటితో ఉండకుండా ట్రాఫిక్ పోలీసులకు మరింత ఇబ్బంది కలిగించాలని నిర్ణయించుకుని, రమేష్ తన బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ యొక్క విద్యుత్ సరఫరాను కూడా కట్ చేసాడు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ 2 గంటలకు మించి పనిచేయలేదు. ఈ సంఘటన తర్వాత పోలీసులు విద్యుత్ విభాగాన్ని సంప్రదించారు.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

విద్యుత్ శాఖ సంబంధిత అధికారులు వచ్చిన కొద్ది గంటలకే పోలీస్ స్టేషన్లకు కరెంట్ వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ కి కూడా కరెంట్ సప్లై చేయబడింది. విద్యుత్తు అంతరాయానికి కారణమేమిటో మొదట్లో స్పష్టంగా తెలియలేదు. అయితే దర్యాప్తు అనంతరం రమేష్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నివేదికల ప్రకారం కోర్టు నిందితుడు రమేష్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. హెల్మెట్ ధరించనందుకు పోలీసులు ఎలక్ట్రిక్ బోర్డ్ లైన్‌మన్‌కు రూ. 500 జరిమానా విధించారు.

జరిమానా విధించినందుకు పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగి.. ఎక్కడో తెలుసా..!

పోలీసులు జరిమానా విధించారనే ఆగ్రహంతో, లైన్‌మ్యాన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్తును కత్తిరించాడు. ఇది కూడా అప్పుడు ఒక సమస్యగా మారింది. ఏది ఏమైనా వాహనదారులు ఈవిధంగా చేయడం తప్పు, విధుల్లో ఉన్న పోలీసులు చట్టపరమైన చరియలు తీసుకున్నప్పుడు వారిపై ఈ విధంగా కక్ష సాధింపు చర్య చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.

More from DriveSpark

Article Published On: Friday, February 12, 2021, 9:45 [IST]
English summary
Fined By Traffic Cops, Power Department Employee Cuts Power Supply To 2 Police Stations. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+