Just In
- 1 hr ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!
పోలీస్ స్టేషన్లకు ఎలక్ట్రిక్ సప్లై కట్ చేసినందుకు గాను తెలంగాణ స్టేట్ సదరన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి రమేష్ అరెస్టయ్యాడు. పోలీస్ స్టేషన్ కి కరెంట్ ఎందుకు కట్ చేసాడు, పోలీసులు అతనిని ఎదుకు అరెస్ట్ చేశారన్న విషయాన్నీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం రమేష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో కోపోద్రేకుడైన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ కి కరెంట్ కట్ చేసాడు. ఈ సంఘటన తరువాత రమేష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ బైక్ను ఒక బాలుడు రైడ్ చేసాడు. సాధారణంగా వాహన చట్టం ప్రకారం మైనర్లు బైక్ నడపడానికి అనర్హుడు. ఈ కారణంగా రమేష్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
అతనికి జరిమానా విధించిన వెంటనే రమేష్ ఘటనా స్థలానికి వెళ్లి విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ ఉల్లంఘన యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ పోలీసులకు అతనికి జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు.
MOST READ:రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సంఘటన స్థలం నుండి వెళ్లిన రమేష్, పోలీస్ స్టేషన్లకు కరెంట్ కట్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం, జుడిమట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్లకు కరెంట్ కట్ చేసాడు. కరెంట్ కట్ అవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ లో కొంత ఇబ్బందికార వాతావరణం ఏర్పడింది.
ఇంతటితో ఉండకుండా ట్రాఫిక్ పోలీసులకు మరింత ఇబ్బంది కలిగించాలని నిర్ణయించుకుని, రమేష్ తన బైక్ను ట్రాఫిక్ పోలీసులు ఆపి ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ యొక్క విద్యుత్ సరఫరాను కూడా కట్ చేసాడు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ 2 గంటలకు మించి పనిచేయలేదు. ఈ సంఘటన తర్వాత పోలీసులు విద్యుత్ విభాగాన్ని సంప్రదించారు.
MOST READ:ఫాస్ట్ట్యాగ్ మినిమమ్ బ్యాలెన్స్పై క్లారిటీ ఇచ్చిన NHAI
విద్యుత్ శాఖ సంబంధిత అధికారులు వచ్చిన కొద్ది గంటలకే పోలీస్ స్టేషన్లకు కరెంట్ వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ కి కూడా కరెంట్ సప్లై చేయబడింది. విద్యుత్తు అంతరాయానికి కారణమేమిటో మొదట్లో స్పష్టంగా తెలియలేదు. అయితే దర్యాప్తు అనంతరం రమేష్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నివేదికల ప్రకారం కోర్టు నిందితుడు రమేష్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటన జరిగింది. హెల్మెట్ ధరించనందుకు పోలీసులు ఎలక్ట్రిక్ బోర్డ్ లైన్మన్కు రూ. 500 జరిమానా విధించారు.
MOST READ:హోండా యాక్టివా 6జి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు & వివరాలు
పోలీసులు జరిమానా విధించారనే ఆగ్రహంతో, లైన్మ్యాన్ పోలీస్ స్టేషన్కు విద్యుత్తును కత్తిరించాడు. ఇది కూడా అప్పుడు ఒక సమస్యగా మారింది. ఏది ఏమైనా వాహనదారులు ఈవిధంగా చేయడం తప్పు, విధుల్లో ఉన్న పోలీసులు చట్టపరమైన చరియలు తీసుకున్నప్పుడు వారిపై ఈ విధంగా కక్ష సాధింపు చర్య చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.