Just In
- 18 min ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్
భోజనప్రియులకు ఓ గోల్డెన్ ఛాన్స్. మేము పెట్టిన బువ్వ పూర్తిగా తింటే, బుల్లెట్ బైక్ ఉచితంగా ఇస్తామంటూ ఓ వినూత్నమైన ఛాలెంజ్తో ముందుకొచ్చింది ఓ రెస్టారెంట్. మరి ఆ కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం రండి..
పూణేకి చెందిన 'హోటల్ శివరాజ్' అనే రెస్టారెంట్ 'బుల్లెట్ థాలి' ఛాలెంజ్ను ఆఫర్ చేస్తోంది. ఈ థాలిని పూర్తిగా వదలకుండా తిన్న వారికి రూ.1.65 లక్షల విలువైన సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను ఉచితంగా అందిస్తామంటూ ఛాలెంజ్ చేస్తోంది.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ 'బుల్లెట్ థాలి' ప్లేట్ను 1 గంటలోపు పూర్తిగా తినేయాలి. ప్లేటులో ఏ కొంచెం మిగిలినా వారు ఈ పోటీకి అనర్హులు అవుతారు. ఈ బుల్లెట్ థాలిలో సుమారు 4 కిలోల బరువైన ఆహారం ఉంటుంది. ఇందులో మటన్ మరియు వేయించిన చేపలతో పాటుగా సుమారు 12 రకాల వంటకాలతో కూడిన ఆహారం ఉంటుంది.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]
ఈ స్పెషల్ బుల్లెట్ థాలీలో ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీలతో పాటుగా మొత్తం 12 రకాల వంటకాలు ఉంటాయి. కస్టమర్ల కోసం ఈ నాన్-వెజ్ ప్లేట్ను సిద్ధం చేయడానికి దాదాపు 55 మంది పనిచేస్తారు.
హోటల్ పేర్కొన్న సమయంలో ఈ ప్లేట్ పూర్తి చేసిన వారికి రెస్టారెంట్ నుండి ఉచితంగా బుల్లెట్ బైక్ ఇవ్వబడుతుంది. కానీ, ఈ ప్లేట్ పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు. బుల్లెట్ థాలి ప్లేట్ ఛాలెంజ్కు రెండు ఆప్షన్లు ఉన్నాయి.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?
ఇందులో మొదటి రూ.4,444 విలువైన పెద్ద బుల్లెట్ ప్లేట్. ఈ ప్లేట్ను ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక గంట వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా తిన్నవారు పూర్తి ఉచితంగా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
అలాకాకుండా, ఒక్కరే ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే, రెండవ ఆప్షన్ అయిన రూ.2500 విలువైన చిన్న బుల్లెట్ ప్లేట్ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లేట్ను కూడా ఒక గంట వ్యవధిలోనే పూర్తిగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వ్యక్తిని కొత్త ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ వరిస్తుంది.
MOST READ:2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్లు రెస్టారెంట్లకు రావటానికి సంకోచిస్తున్న నేపథ్యంలో, తమ రెస్టారెంట్కు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించినట్లు హోటల్ యజమాని తెలిపారు. తమ హోటల్లో కోవిడ్-19 నిబంధనలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ బుల్లెట్ థాలి ఛాలెంజ్ కోసం సదరు రెస్టారెంట్ ఓనర్ తన హోటల్ ముందు 5 సరికొత్త బుల్లెట్ బైక్లను ఉంచాడు. పూణేలోని ఓల్డ్ ముంబై-పూణే హైవేలోని వాడ్గావ్ మావల్ వద్ద ఈ హోటల్ శివరాజ్ అనే రెస్టారెంట్ ఉంది.
MOST READ:స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
కొంతకాలం క్రితం ఈ రెస్టారెంట్ వారు 8 కిలోల రావన్ థాలిని కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఈ థాలిని పూర్తి చేసిన వారికి 5000 రూపాయల నగదు బహుమతిని కూడా అందించారు. అంతేకాకుండా, రావన్ థాలికి వసూలు చేయాల్సిన డబ్బును కూడా కస్టమర్ల నుండి తీసుకోలేదు.
కాగా, సోలాపూర్ జిల్లాకు చెందిన సోమ్నాథ్ పవార్ అనే వ్యక్తి ఈ స్పెషల్ బుల్లెట్ థాలీని నిర్ణీత టైమ్లో ఫినిష్ చేసి సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను గెల్చుకున్నాడని సదరు రెస్టారెంట్ పేర్కొంది.