Just In
- 10 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
Don't Miss
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్
భోజనప్రియులకు ఓ గోల్డెన్ ఛాన్స్. మేము పెట్టిన బువ్వ పూర్తిగా తింటే, బుల్లెట్ బైక్ ఉచితంగా ఇస్తామంటూ ఓ వినూత్నమైన ఛాలెంజ్తో ముందుకొచ్చింది ఓ రెస్టారెంట్. మరి ఆ కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం రండి..
పూణేకి చెందిన 'హోటల్ శివరాజ్' అనే రెస్టారెంట్ 'బుల్లెట్ థాలి' ఛాలెంజ్ను ఆఫర్ చేస్తోంది. ఈ థాలిని పూర్తిగా వదలకుండా తిన్న వారికి రూ.1.65 లక్షల విలువైన సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను ఉచితంగా అందిస్తామంటూ ఛాలెంజ్ చేస్తోంది.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ 'బుల్లెట్ థాలి' ప్లేట్ను 1 గంటలోపు పూర్తిగా తినేయాలి. ప్లేటులో ఏ కొంచెం మిగిలినా వారు ఈ పోటీకి అనర్హులు అవుతారు. ఈ బుల్లెట్ థాలిలో సుమారు 4 కిలోల బరువైన ఆహారం ఉంటుంది. ఇందులో మటన్ మరియు వేయించిన చేపలతో పాటుగా సుమారు 12 రకాల వంటకాలతో కూడిన ఆహారం ఉంటుంది.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]
ఈ స్పెషల్ బుల్లెట్ థాలీలో ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీలతో పాటుగా మొత్తం 12 రకాల వంటకాలు ఉంటాయి. కస్టమర్ల కోసం ఈ నాన్-వెజ్ ప్లేట్ను సిద్ధం చేయడానికి దాదాపు 55 మంది పనిచేస్తారు.
హోటల్ పేర్కొన్న సమయంలో ఈ ప్లేట్ పూర్తి చేసిన వారికి రెస్టారెంట్ నుండి ఉచితంగా బుల్లెట్ బైక్ ఇవ్వబడుతుంది. కానీ, ఈ ప్లేట్ పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు. బుల్లెట్ థాలి ప్లేట్ ఛాలెంజ్కు రెండు ఆప్షన్లు ఉన్నాయి.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?
ఇందులో మొదటి రూ.4,444 విలువైన పెద్ద బుల్లెట్ ప్లేట్. ఈ ప్లేట్ను ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక గంట వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా తిన్నవారు పూర్తి ఉచితంగా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
అలాకాకుండా, ఒక్కరే ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే, రెండవ ఆప్షన్ అయిన రూ.2500 విలువైన చిన్న బుల్లెట్ ప్లేట్ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లేట్ను కూడా ఒక గంట వ్యవధిలోనే పూర్తిగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వ్యక్తిని కొత్త ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ వరిస్తుంది.
MOST READ:2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్లు రెస్టారెంట్లకు రావటానికి సంకోచిస్తున్న నేపథ్యంలో, తమ రెస్టారెంట్కు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించినట్లు హోటల్ యజమాని తెలిపారు. తమ హోటల్లో కోవిడ్-19 నిబంధనలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ బుల్లెట్ థాలి ఛాలెంజ్ కోసం సదరు రెస్టారెంట్ ఓనర్ తన హోటల్ ముందు 5 సరికొత్త బుల్లెట్ బైక్లను ఉంచాడు. పూణేలోని ఓల్డ్ ముంబై-పూణే హైవేలోని వాడ్గావ్ మావల్ వద్ద ఈ హోటల్ శివరాజ్ అనే రెస్టారెంట్ ఉంది.
MOST READ:స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
కొంతకాలం క్రితం ఈ రెస్టారెంట్ వారు 8 కిలోల రావన్ థాలిని కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఈ థాలిని పూర్తి చేసిన వారికి 5000 రూపాయల నగదు బహుమతిని కూడా అందించారు. అంతేకాకుండా, రావన్ థాలికి వసూలు చేయాల్సిన డబ్బును కూడా కస్టమర్ల నుండి తీసుకోలేదు.
కాగా, సోలాపూర్ జిల్లాకు చెందిన సోమ్నాథ్ పవార్ అనే వ్యక్తి ఈ స్పెషల్ బుల్లెట్ థాలీని నిర్ణీత టైమ్లో ఫినిష్ చేసి సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను గెల్చుకున్నాడని సదరు రెస్టారెంట్ పేర్కొంది.