Just In
- 1 hr ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 3 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 4 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 7 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్పై మండిపడ్డ నటి కస్తూరి
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మన హైదరాబాదులో ప్రాణం పోసుకున్న భారత దేశపు తొలి మేడియన్ ఇండియా రైలు "మేథా"
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా ఉన్న 164 ఏళ్ల ఇండియన్ రైల్వే చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయిలో మేడిన్ ఇండియా రైలు పట్టాలెక్కింది. ఈ రైలు గురించి మరింత సమాచారం ఇవాళ్టి కథనంలో...
ఏప్రిల్
16,
1853
లో
స్థాపించబడి,
1951
లో
చిన్న
చిన్న
రైల్వే
శాఖలన్నింటిని
కలుపుకొని
ఇండియన్
రైల్వేగా
జాతీయం
చెంది
ప్రపంచంలోనే
అతి
పెద్ద
రైల్వే
సంస్థగా
ఆవిర్బవించిన
ఇండియన్
రైల్వే
యొక్క
మొట్టమొదటి
మేడిన్
ఇండియా
రైలు
గురించి
మరిన్ని
వివరాలు
నేటి
రైలు
సెక్షన్
ద్వారా
తెలుసుకుందాం
రండి...
కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ,, శ్రీ సురేశ్ ప్రభు గారు భారతదేశపు మొట్టమొదటి మేడియన్ ఇండియా రైలు "మేధా"ను ముంబాయ్ వేదికగా జెండా ఊపి ప్రారంభించారు.
మేధా రైలును ఇండియన్ రైల్వే తమ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (IFC) చెన్నైలో తయారు చేసింది. ఇందులో స్పెషల్ త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్ను అందివ్వడం జరిగింది. గతంలో ఇండియన్ రైల్వే బాంబర్డైయర్ లేదంటే సైమెన్స్ సంస్థలకు చెందిన ఇఎమ్యులను వినియోగించేది.
దేశీయంగా తయారైన రైలు ద్వారా సుమారుగా 50 లక్షల అమెరికన్ డాలర్ల కరెన్సీన్ ఆదా అయ్యింది. సాధారణ రైలు కన్నా ఈ మేడిన్ ఇండియా రైలును 25 శాతం తక్కువ ధరతో తయారు చేసినట్లు తెలిసింది.
ఇంజన్, 12 కోచ్లతో పాటు ఈ మేధా రైలు పట్టాలెక్కడానికి రూ. 43.23 కోట్లు రుపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.
ఇదే వేదిక మీదుగా కేంద్ర రైల్వే మంత్రి అంత్యోదయ రైలును లోకమాన్య తిలక్ మరియు టాటా నగర్ల మధ్య జెండా ఊపి ప్రారంభించారు. రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులకు కూడా అదే తరహా సౌకర్యాలను కల్పిస్తూ ఈ సర్వీసును ప్రారంభించినట్లు సురేశ్ ప్రభు గారు తెలిపారు.
మేధా రైలులో అత్యంత శక్తివంతమైన మేడిన్ ఇండియా త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. హైదరాబాద్ ఆధారిత మేధా సర్వో డ్రైవ్ సంస్థ ఈ సిస్టమ్ను తయారు చేసింది. అందుకుగాను, ఈ రైలుకు మేధా అని పేరు పెట్టారు.
ప్రయాణం సమయంలో రైలు పెట్టెలు డ్యామేజ్కు గురికాకుండా ఇన్ బిల్ట్ సిస్టమ్ ద్వారా తక్కువ ప్రమాద రేటును నమోదు చేసేలా నిర్మించారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
మొదటి శ్రేణి కోచ్లలో మెత్తటి కుషనింగ్ గల సీట్లను మరియు ద్వితీయ శ్రేణి కోచ్లలో స్టెయిన్ లెస్ స్టీల్ సీట్లను ఈ మేధా రైలులో అందివ్వడం జరిగింది.
స్టెయిన్ లెస్ స్టీల్ భోగీలలో సులభంగా ప్రక్కకు జరపడం మరియు తక్కువ బరువున్న డోర్లను, ఎల్ఇడి లైట్లు, అత్యుత్తమ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, జిపిఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లతో పాటు అత్యుత్తమ గాలి ప్రసరణ కోసం మోడ్యులర్ రూఫ్ మౌంటెడ్ ఫోర్స్ వెంటిలేషన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.