Just In
- 8 hrs ago
బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 10 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 12 hrs ago
భారత్లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్బర్డ్; ధర & వివరాలు
- 13 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే
విమాన ప్రయాణాలు, ప్రయాణికునికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఏదైనా తేడా జరిగితే అంత దుఃఖాన్ని మిగులుస్తాయి. సాధారణంగా విమానం ఒకసారి టేకాఫ్ అయినా తర్వాత దాని గమ్యస్థానలోనే ల్యాండ్ అవుతుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక పిల్లి చేసిన పని వల్ల విమానం వెంటనే ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నివేదికల ప్రకారం ఈ విచిత్రమైన సంఘటన సుడాన్లో జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ నుండి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న విమానం ఒక పిల్లి దాడి కారణంగా ఖార్టూమ్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు జరిగిందంటే, విమానం యొక్క కాక్పిట్లో ఒక పిల్లి చేరింది.

మొదట్లో పిల్లి విమానం కాక్పిట్లో చేరినట్లు పైలట్ గమనించలేదు. విమానం బయలుదేరిన అరగంట తరువాత, విమానం నడుపుతున్న పైలట్పై పిల్లి దాడి చేసింది. పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించిన పైలట్ పిల్లిని అక్కడి నుండి తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కానీ పిల్లి మరింత ఆందోళనకు గురై పైలట్పై మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనలో విమానం పైలట్ గాయపడ్డాడు.
MOST READ:భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఆ సమయంలో పిల్లి చేసిన ఈ పని వల్ల వెంటనే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ పిల్లి కాక్పిట్లోకి ఎలా ప్రవేశించిందో తెలియదు. ఖార్టూమ్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై తీవ్రమైన దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, పిల్లి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.

కోపంతో ఉన్న పిల్లి పైలట్పై దాడి చేసి విమానం టేకాఫ్ అయినా కొద్దీ చేపటికే ల్యాండ్ అయ్యేలా చేసింది. ఈ సంఘటన వల్ల విమానంలో ప్రయాణికులు చాలా భయపడ్డారు.
MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

కొంతమంది నెటిజన్లు ఈ సంఘటనను పిల్లి చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆపి ఉంచినప్పుడు లేదా శుభ్రపరిచేటప్పుడు పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

సంఘటనకు ముందు రోజు రాత్రి విమానం విమానాశ్రయంలో నిలిపి ఉంచబడింది. ఆ సమయంలో పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కానీ ఖచ్చితమైన కారణం తెలియదు. విమానం శుబ్రపరిచేటప్పుడు మరియు ఇంజనీరింగ్ తనికీ చేసినప్పుడు కూడా ఈ పిల్లిని గమనించకపోవడం గమనార్హం.

ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తాయి. సంబంధిత అధికారులు జాగరూకగా ఉండాలి, అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయి.