తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు కాలువలు నిండిపోవడమే కాకుండా, ప్రజల నివాసాలలోకి కూడా వరద నీరు వస్తోంది. బుధవారం హైదరాబాద్ ఆకస్మిక వర్షాల వల్ల దాదాపు 30 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో వరద లాంటి పరిస్థితి తలెత్తింది. వరదలు రోడ్లపైకి రావడం వల్ల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఈ వరదలు ఎక్కువ ఆస్తి నష్టానికి దారితీశాయి. వర్షం కారణంగా సంభవించిన వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోవాదమే కాకుండా ప్రజలు మృత్యువాతపడుతున్నారు. వరద ఉదృతి కొంత తగ్గిన తరువాత వరద వలన సంభవించిన వినాశనం యొక్క చిత్రాలను చాలా మంది ట్విట్టర్లో పంచుకున్నారు.

వరదలు ఎంత విధ్వంసాన్ని సృష్టించాయో మనం ఈ ఫోటోలలో చూడవచ్చు. రోడ్లపై నీటి ప్రవాహాన్ని చూడవచ్చు. నీటి ప్రవాహంతో చాలా రైళ్లు కూడా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావాలను నివారించడానికి ప్రజలు తమ ఇళ్లనుండి బయటకు వెళ్లకూడదని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి.

అయితే ఇంటి బయట ఆపి ఉంచిన చాలా వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద ప్రభావంతో ప్రజలు తమ ఇళ్లనుండి బయటికి వెళ్లవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు మరియు గురువారం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సెలవు ప్రకటించారు.

వరదలకి కాస్త తుఫాను తోడై ఇప్పటికే ఎక్కువ నాశనానికి కారణమయ్యాయి. తుఫాను కారణంగా అనేక పెద్ద చెట్లు రోడ్లు మరియు ఇళ్లపై పడి ఆస్తి నష్టం కలిగించాయి. అదే సమయంలో వరదలు కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు, పాత భవనాలు కూలిపోయినట్లు వార్తలు వచ్చాయి.

"భూమి అంతం అవుతున్నట్లు కనిపిస్తోంది" అని ట్విట్టర్ వినియోగదారులు ఫోటోలను పంచుకున్నారు. అదే సమయంలో, కొంతమంది ఇంతకుముందు ఇంత భయంకరమైన విధ్వంసం చూడలేదని చెప్పారు.

భారీ వృక్షాలు నేలకొరగడంతో విధ్యుత్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇది బ్లాక్అవుట్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం కోరినట్లు చెప్పారు. సహాయ మరియు సహాయక చర్యల కోసం నగరంలో జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని నియమించారు. ఏది ఏమైనా అకాల వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి.


Click it and Unblock the Notifications








