Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 12 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 13 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు కాలువలు నిండిపోవడమే కాకుండా, ప్రజల నివాసాలలోకి కూడా వరద నీరు వస్తోంది. బుధవారం హైదరాబాద్ ఆకస్మిక వర్షాల వల్ల దాదాపు 30 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో వరద లాంటి పరిస్థితి తలెత్తింది. వరదలు రోడ్లపైకి రావడం వల్ల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
ఈ వరదలు ఎక్కువ ఆస్తి నష్టానికి దారితీశాయి. వర్షం కారణంగా సంభవించిన వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోవాదమే కాకుండా ప్రజలు మృత్యువాతపడుతున్నారు. వరద ఉదృతి కొంత తగ్గిన తరువాత వరద వలన సంభవించిన వినాశనం యొక్క చిత్రాలను చాలా మంది ట్విట్టర్లో పంచుకున్నారు.
వరదలు ఎంత విధ్వంసాన్ని సృష్టించాయో మనం ఈ ఫోటోలలో చూడవచ్చు. రోడ్లపై నీటి ప్రవాహాన్ని చూడవచ్చు. నీటి ప్రవాహంతో చాలా రైళ్లు కూడా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావాలను నివారించడానికి ప్రజలు తమ ఇళ్లనుండి బయటకు వెళ్లకూడదని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి.
MOST READ:ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్
అయితే ఇంటి బయట ఆపి ఉంచిన చాలా వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద ప్రభావంతో ప్రజలు తమ ఇళ్లనుండి బయటికి వెళ్లవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు మరియు గురువారం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సెలవు ప్రకటించారు.
వరదలకి కాస్త తుఫాను తోడై ఇప్పటికే ఎక్కువ నాశనానికి కారణమయ్యాయి. తుఫాను కారణంగా అనేక పెద్ద చెట్లు రోడ్లు మరియు ఇళ్లపై పడి ఆస్తి నష్టం కలిగించాయి. అదే సమయంలో వరదలు కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు, పాత భవనాలు కూలిపోయినట్లు వార్తలు వచ్చాయి.
MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?
"భూమి అంతం అవుతున్నట్లు కనిపిస్తోంది" అని ట్విట్టర్ వినియోగదారులు ఫోటోలను పంచుకున్నారు. అదే సమయంలో, కొంతమంది ఇంతకుముందు ఇంత భయంకరమైన విధ్వంసం చూడలేదని చెప్పారు.
భారీ వృక్షాలు నేలకొరగడంతో విధ్యుత్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇది బ్లాక్అవుట్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం కోరినట్లు చెప్పారు. సహాయ మరియు సహాయక చర్యల కోసం నగరంలో జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని నియమించారు. ఏది ఏమైనా అకాల వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి.
MOST READ:మహీంద్రా స్కార్పియోలో ఇప్పుడు అదిరిపోయే కొత్త ఫీచర్; ఏంటో తెలుసా?