విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

భారతదేశంలో పై స్థాయి అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులపై అజమాయిశీ చల్లచించడం ఇప్పటికే చాలా సందర్భాలలో చూసి ఉంటాము. కొంతమంది రాజకీయ నాయకులు అధికారదర్పంతో చాలామందికి కించపరచడం మరియు అవమానించిన విషయాలు ఇప్పటికే కోకొల్లలు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP

తమిళనాడు (చెన్నై) మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపి) సేలంలోని టోల్ గేట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీసుపై దాడి చేసిన సంఘటన కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP

ఈ వీడియో ప్రకారం డిఎంకె మాజీ ఎంపి కె అర్జునన్ టోల్ గేట్ వద్ద డ్యూటీ పోలీసు సిబ్బందిని నెట్టడం, తన్నడం మరియు మాటలతో అవమానించడం మనం ఇక్కడ వీడియోలో గమనించవచ్చు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP

కరోనా నేపథ్యంలో విధుల్లో టోల్ గేట్ వద్ద వున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య ప్రయాణానికి ఇ-పాస్ అడిగినప్పుడు మాజీ MP ఆ పోలీసుపై ఈ విధంగా ఉద్రిక్తుడయ్యాడు. విధుల్లో ఉన్న పోలీసుపై ఈ విధంగా ప్రవర్తించిన ఆ మాజీ MP పై ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP

భారతదేశంలో రోజు రోజుకి కరోనా కేసులు అధికం అవుతున్న కారణంగా ఒక రాష్ట్రము నుంవచ్చి ఇంకో రాష్ట్రానికి వెళ్లాలంటే తప్పకుండా ఇ-పాస్ అవసరం. ముక్యంగా రాష్ట్రంలో ఇప్పటికి లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఈ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

తమిళనాడులో ఇప్పటికే కరోనా అధికంగా విజృంభిస్తోంది. అందువల్ల కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జూన్ 19 నుండి తమిళనాడు ప్రభుత్వం చెన్నై, చెంగల్‌పేట్, కాంచీపురం మరియు తిరువల్లూరు అనే నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. తమిళనాడులో కొత్తగా 3,940 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 54 మరణాలు సంభవించాయని, మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికి 82,275 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP

రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల్లో 45,537 డిశ్చార్జెస్, 35,656 యాక్టివ్ కేసులు, 1,079 మరణాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించింది, ఈ లాక్ డౌన్ కి మధ్యలో కొన్ని సడలింపులు కల్పించడం వల్ల వావనదారులు మరియు ప్రజలు ఎక్కువ కావడంతో తిరిగి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ కారణంగా అక్కడ మళ్ళీ కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 30, 2020, 17:16 [IST]
English summary
VVIP racism on display again! Former DMK MP K Arjunan abuses, kicks a cop on duty in Tamil Nadu. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+