దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?
మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు దేవేగౌడకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త లగ్జరీ కారు అందించింది. దేవేగౌడకు గత వారం కొత్త వోల్వో కారు అందించడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలోని ఏ ప్రతినిధికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖరీదైన వాహనం అందించలేదు. ఈ కారు రాజ్యసభ సభ్యులకు ఇవ్వగల కారు ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధర కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఈ కారు ఇవ్వబడింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విమర్శలు ఎదుర్కొంటోంది. నిబంధనల ప్రకారం ఎన్నికైన ప్రతినిధులు, క్యాబినెట్ మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు రూ. 22 లక్షల వరకు విలువైన కార్లు కొనడానికి అనుమతి ఉంది.

కార్పొరేషన్ బోర్డు చైర్మన్ రూ. 11 లక్షల విలువైన కార్లను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కానీ ముఖ్యమంత్రుల వాహనాల కొనుగోలుకు పరిమితి లేదు. మాజీ ప్రధానులకు కారు ఇవ్వడానికి నిబంధన కొంత వరకు మార్చబడిందని తెలిపారు.

వోల్వో ఎక్స్సి 60 దేవేగౌడ కోసం కొనుగోలు చేయబడింది. ఈ కారు ధర రూ. 76 లక్షలు. ఈ కారుకు ప్రభుత్వ కారుగా పరిగణిస్తుంది కావున పన్ను విధించబడదు. ఈ కారు యొక్క ఆన్-రోడ్ ధర రూ. 60 లక్షలు.

దేవేగౌడకు సౌకర్యవంతమైన కారు కావాలని చెబుతున్నారు. కర్ణాటక నుంచి ప్రధానిగా నియమితులైన ఏకైక వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఈ కారు కొనడానికి అంగీకరించారు.

ప్రస్తుతం, కర్ణాటకలోని చాలా మంది మంత్రులు మరియు శాసనసభ్యులు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎంపివిని ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రతిపక్ష నాయకుడు టయోటా ఫార్చ్యూనర్ రూ .40 - 45 లక్షల ఖరీదు గల ఎస్యూవీలను ఉపయోగిస్తున్నారు.

ఈ కొత్త కారును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నమోదు చేశారు. మాజీ ప్రధానిలకు ముఖ్యమంత్రి ఉపయోగించిన కారు కంటే ఖరీదైన కారు ఇచ్చారు. వోల్వో కార్లు లగ్జరీ ఫీచర్స్ కి ప్రసిద్ధి చెందాయి. ఇటీవల, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కొనుగోలు చేశారు. ఈ కారును ముంబైలోని తన నివాసంలో అమితాబ్ బచ్చన్కు అందజేశారు.


Click it and Unblock the Notifications








