Free Tea On Highways: హైవేలపై బస్సు, లారీల డ్రైవర్లకు ఉచిత ‘టీ'.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రోడ్డుపై భారీ వాహనాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై తిరిగే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని నిర్ణయించింది. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైవేలపై భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో వెళ్లే భారీ వాహనాలు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదాలకు గురవుతున్నాయి. నిద్ర లేమి, దృష్టి మరల్చడం కారణంగా ఎక్కువగా యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోనుంది.

ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని జాతీయ రహదారి టోల్ బూత్ల సమీపంలోని థాపా సమీపంలోని సంబంధిత ప్రాంత ఆర్టీఓ తరపున భారీ వాహన చోదకులకు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా టీ అందించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సాహు జారీ చేశారు.
ఈ వేడి టీ(Free Tea Service For Drivers) తాగడం వల్ల తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లకు ఉపశమనం కలుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆర్టీఓలు టోల్ బూత్ సమీపంలోని హోటళ్ల ద్వారా డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని యోచిస్తున్నాయి.

దీని కోసం ఒక్కో ఆర్టీఓకు రూ. 5000 చొప్పున నిధులు కేటాయించారు. దీని ఆధారంగా జనవరి 7వ తేదీ వరకు ఈ ఉచిత టీ కార్యక్రమాన్ని(Free Tea Service in Odisha) నిర్వహించాలని తెలియజేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
దీని ద్వారా డ్రైవర్లకు ఉచిత టీ లభించడమే కాకుండా కొంత సమయం విరామం కూడా లభిస్తుంది. ఆ సమయంలో వారు రిఫ్రెష్ అయ్యి యాక్టివ్గా డ్రైవింగ్ చేయవచ్చు. ఈ మేరకు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఉచితంగా టీ అందించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని రవాణా శాఖ మంత్రి ఆదేశించారు.
సాధారణంగా జాతీయ రహదారులపై తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమయంలో డ్రైవర్లు అతిగా నిద్రపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించడానికి, ఈ సమయంలో డ్రైవర్లను రిఫ్రెష్ చేయడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీ ఇవ్వాలని నిర్ణయించింది.
రోడ్డు భద్రతపై ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి రాష్ట్రం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పలు చర్యలు తీసుకుంటుంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చొరవ తీసుకోవడం నిజంగా అభినందనీయం. ఈ విధానం ద్వారా భారీ వాహన చోదకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో చొరవ తీసుకుని ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను వినియోగించుకుని ప్రజలకు, వాహన చోదకులకు అవగాహన కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా పలు రాష్ట్రాల్లో రోడ్లపై ర్యాలీలు నిర్వహించడం, హెల్మెట్లు అందజేయడం లాంటి చర్యలు చేపడుతున్నారు.
రోడ్లపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ర్యాలీ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దీనిపై ప్రజల్లో మరింత చైతన్యం వచ్చేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








