Just In
- 7 min ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 16 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 17 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
Don't Miss
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. కరోనా మహమ్మారితో వేలాదిమంది ప్రజలు పోరాడుతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో ప్రకటించిన లాక్ డౌన్ వల్ల అన్ని వాణిజ్యం సేవల లావాదేవీలు ఆగిపోయాయి.
లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం వల్ల రోడ్డు పై వాహనాలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి.ఈ కారణంగా ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.
దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం ఏప్రిల్ మొదటి వారాల్లో భారత రాష్ట్రాల్లోని ఇంధన కేంద్రాలు మునుపటికంటే 50% తక్కువ ఇంధనాన్ని విక్రయించినట్లు తెలిపాయి. ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం మరియు భారత్ పెట్రోలియం దెస వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కానీ లాక్ డౌన్ వల్ల అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
MOST READ: లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ అమ్మకాల విషయానికొస్తే, ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో వాటి అమ్మకాలు ఏకంగా 61% తగ్గాయి. జెట్ ఇంధన అమ్మకాలు ఒకేసారి 64% పడిపోయాయి.
లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పెద్ద మొత్తంలో ఎల్పిజి గ్యాస్ను విక్రయిస్తోంది. కరోనా రోజు రోజుకి మరింత విస్తరిస్తున్న కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం 2020 మే 3 వరకు పొడిగించింది.
MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే
కరోనా వైరస్ సోకని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొన్ని పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలను హాట్స్పాట్లుగా పరిగణించరు. ఈ ప్రాంతాలలో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో ఇంధన వినియోగంపై అంతర్జాతీయ ఎనర్జీ సంస్థ (ఐఇఎ) ఒక నివేదికను సమర్పించింది. మార్చిలో ఇంధన డిమాండ్ 2.4% పెరిందని, 2020 లో ఇంధన వినియోగం దాదాపు 5.6% తగ్గుతుందని అంచనా వేసింది.
MOST READ: కరోనా లాక్డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?
ఏది ఏమైనా కరోనా మహమ్మారి వల్ల దేశంలో ప్రజలు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా కేవలం ప్రజలను మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమలను కూడా ప్రభావితం చేసింది. ఎట్టకేలకు భారతదేశంలో ఏ రోజు నుంచి కొన్ని రాష్ట్రాలలోని జిల్లాలలో పాక్షిక లాక్ డౌన్ సడలింపు ఉంది. ఈ కారణంగా కొంత వరకు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది.