Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. కరోనా మహమ్మారితో వేలాదిమంది ప్రజలు పోరాడుతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో ప్రకటించిన లాక్ డౌన్ వల్ల అన్ని వాణిజ్యం సేవల లావాదేవీలు ఆగిపోయాయి.

లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం వల్ల రోడ్డు పై వాహనాలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి.ఈ కారణంగా ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం ఏప్రిల్ మొదటి వారాల్లో భారత రాష్ట్రాల్లోని ఇంధన కేంద్రాలు మునుపటికంటే 50% తక్కువ ఇంధనాన్ని విక్రయించినట్లు తెలిపాయి. ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం మరియు భారత్ పెట్రోలియం దెస వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కానీ లాక్ డౌన్ వల్ల అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
MOST READ: లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

పెట్రోల్, డీజిల్ అమ్మకాల విషయానికొస్తే, ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో వాటి అమ్మకాలు ఏకంగా 61% తగ్గాయి. జెట్ ఇంధన అమ్మకాలు ఒకేసారి 64% పడిపోయాయి.

లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పెద్ద మొత్తంలో ఎల్పిజి గ్యాస్ను విక్రయిస్తోంది. కరోనా రోజు రోజుకి మరింత విస్తరిస్తున్న కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం 2020 మే 3 వరకు పొడిగించింది.
MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే

కరోనా వైరస్ సోకని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొన్ని పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలను హాట్స్పాట్లుగా పరిగణించరు. ఈ ప్రాంతాలలో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో ఇంధన వినియోగంపై అంతర్జాతీయ ఎనర్జీ సంస్థ (ఐఇఎ) ఒక నివేదికను సమర్పించింది. మార్చిలో ఇంధన డిమాండ్ 2.4% పెరిందని, 2020 లో ఇంధన వినియోగం దాదాపు 5.6% తగ్గుతుందని అంచనా వేసింది.
MOST READ: కరోనా లాక్డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?

ఏది ఏమైనా కరోనా మహమ్మారి వల్ల దేశంలో ప్రజలు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా కేవలం ప్రజలను మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమలను కూడా ప్రభావితం చేసింది. ఎట్టకేలకు భారతదేశంలో ఏ రోజు నుంచి కొన్ని రాష్ట్రాలలోని జిల్లాలలో పాక్షిక లాక్ డౌన్ సడలింపు ఉంది. ఈ కారణంగా కొంత వరకు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది.