రోడ్డుపై యాక్టివా స్కూటర్పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్
సమాజం అభివృద్ధివైపు పరుగులు తీస్తున్న తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. పురుషుల కంటే ఏ మాత్రం తక్కువ కాదు మరియు ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. అంతే కాదు పురుషులు చేయలేని ఎన్నో పనులను కూడా మహిళలు అవలీలగా సాధించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు మునుపటికంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నారు.

ఎన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నప్పటికీ, డ్రైవింగ్ లో మాత్రం కొంతవరకు మహిళలకు కొంత కష్టతరంగానే ఉందని చెప్పాలి. ఇటీవల యూట్యూబ్లో విడుదలైన ఒక వీడియో గమనించినట్లయితే, ఈ వీడియోలో, యాక్టివా స్కూటర్ మరియు కెటిఎమ్ బైక్ రైడర్ మధ్య జరిగిన వాదన చూడవచ్చు.

యాక్టివా స్కూటర్పై ఉన్న యువతి మొబైల్ లో మాట్లాడుతూ, కెటిఎం బైక్ రైడర్ కి అడ్డంగా వచ్చింది. ఇక్కడ ఆ యువతి తన మొబైల్లో మాట్లాడటం కూడా మీరు గమనించవచ్చు.

ఆ యువతి అకస్మాత్తుగా బైక్కు అడ్డంగా రావడం వల్ల కెటిఎమ్ బైక్ రైడర్, ప్రశ్నించగానే ఆమె తన మధ్య వేలిని ఆ యువకుడికి చూపిస్తుంది. దీనితో కోపానికి గురైన ఆ యువకుడు యువతితో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆ యువకుడిని ఆ యువతి పోలీస్ స్టేషన్ కి పదా అనటం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ హెల్మెట్లో కెమెరాలో రికార్డ్ చేయబడిందని ఆ యువకుడు చెప్పాడు. ఆ యువతి హెల్మెట్ ధరించలేదని, అంతే కాకుండా మొబైల్లో మాట్లాడుతోందని ఆ యువకుడు చెప్పాడు.
ఇలాంటి మరో సంఘటనలో, పల్సర్ బైక్ నడుపుతున్న ఒక యువకుడు ఆక్టివా స్కూటర్పై ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్న సమయమ్లో జరిగింది. ఈ వీడియోలో మీరు ఒక యువతి స్కూటర్ నడుపుతున్నట్లు చూడవచ్చు. ఈ సంఘటనలో కూడా, యువతీ యువకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. చివరకు హెల్మెట్లో కెమెరాలో రికార్డ్ చేయబడ్డాయి.
ఇలాంటిదే మరో సంఘనటన కార్ లో ప్రయాణిస్తున్న వ్యక్తులకు మరియు బైకర్ కి మధ్య వివాదం జరిగింది. ఆటో వెనుక వస్తున్న పల్సర్ బైక్ కారుని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో, కారులో ఉన్న యువకులు బైకర్స్ పై దాడి చేయడాన్ని చూడవచ్చు. కొంత సేపటికి పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడున్న ప్రజలు వారిని శాంతిపజేశారు.
ఈ సంఘటనలో, బైక్ మీద ఉన్న యువకుడు కెమెరా హెల్మెట్ మీద ఉందని చెప్పగానే, కారులో ఉన్న యువకులు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. ఈ వీడియో ఆధారంగా మీపై కేసు పెడతానని బైక్ రైడర్ కారు రైడర్కు చెబుతాడు.

భారతదేశంలో కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ఉన్నప్పటికీ వాహనదారులు వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1.50 లక్షల మంది మరణిస్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం ఇంకా సరైన అవగాహన పొందలేకపోతున్నారు.
Image Courtesy: AMV TUBE


Click it and Unblock the Notifications








