Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 4 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 6 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 9 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?
భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయా అన్నట్లు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇప్పటికే 100 మార్కుని దాటేశాయి. పెరుగుతున్న ధరలు సామాన్య మానవుడిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేఖంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఎంత మంది ఎన్ని నిరసనలు చేపట్టినా సంబంధిత ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమి జరగనట్లు ఊరకుంటున్నాయి.
ఇటీవల గోవాలోని ఆమ్ ఆద్మీ పార్టీ పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేఖంగా ఒక వినూత్నమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగానే పెట్రోల్, డీజిల్ కొనడానికి వచ్చిన వాహనదారులకు కేక్, చాక్లెట్ వంటి స్వీట్లు అందిస్తూ తమ నిరసనను భిన్నంగా వ్యక్తం చేసింది.
గోవాలో జరిగిన ఈ సంఘటన దేశ ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలోని పనాజీలో ఈ పద్ధతిలో కేకులు మరియు చాక్లెట్లను పంపిణీ చేసింది. రాజకీయ పార్టీలు తమదైన రీతిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలనలో బిజెపి నిరసన వ్యక్తం చేసిన ఫోటోలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. బెంగళూరులో ఈ రోజు లీటరు పెట్రోల్ ధర రూ. 105.25, డీజిల్ ధర రూ. 95.26.
అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల మరియు తగ్గుదల జరుగుతుంది. కానీ ఇటీవల రోజుల్లో ధరలు పెరుగుదల నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధికమైన ట్యాక్క్సులు.
వ్యాట్ మరియు ఇతర పన్నుల కారణంగా, భారతదేశంలో పెట్రోల్ ధర రూ. 100 రూపాయలు దాటేసింది. అధిక పన్నుల కారణంగా, భారతదేశంలో వాహనదారులు ప్రతి లీటరు పెట్రోల్కు 60%, ప్రతి లీటరు డీజిల్కు 54% చెల్లిస్తున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుల కారణంగా ఎక్కువమంది వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్త వాహనాలను కొనుగోలుచేసి వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా చాలా మంది వాహన తయారీదారులు దేశీయ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు.