Just In
- 13 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 15 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 17 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
డ్రైవింగ్ రాకపోతే అద్దెకార్లు తీసుకోకండి అన్న గోవా సిఎం ప్రమోద్ సావంత్... ఇంతకీ ఎం జరిగింది...?
ఇ-చలాన్ (జరిమానాలు) వ్యవస్థను ప్రారంభించడానికి గోవా పోలీసులు నిర్వహించిన ఫంక్షన్ లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాటాడుతూ గోవాలో జరిగే రోడ్డు ప్రమాదాలను గురించి, వాహనాలను డ్రైవింగ్ చేసే వాహనదారుల యొక్క నిర్లక్యాన్ని గురించి చెప్పారు.
మహారాష్ట్రకి చెందిన ఒక మహిళా పర్యాటకురాలు పనాజీ సమీపంలో ఉన్న ఒక ప్రధాన వంతెనపై రోడ్డు ప్రమాదంలో మరణించింది. మరణించిన కొన్ని గంటల తరువాత ఆమె స్కూటర్ ను ఒక ఫోర్ వీలర్ డీ కొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఎందుకంటే వాహనాలను నడపడం రానివారు కూడా వాహనాలను అద్దెకు తీసుకోవడం ఎందుకు అన్నారు.
ఇటీవల కాలంలో పనాజీలోని మాండోవి వంతెనపై ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం చాలా ఘోరంగా అనిపిస్తుంది. వాహనాలను సరిగ్గా నడపలేని వారు కూడా ఎందుకు వాహనాలను తీసుకుని గోవాలో తిరుగుతున్నారో తనకి అర్థం కావడం లేదు అన్నారు. గోవా మనదేశంలో ఒక పర్యాటక ప్రదేశం కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో వాహనాలను నడపడం రానివారు వాహనాలను అద్దెకి తీసుకుని ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి సంఘటనలవల్ల చాలామంది భాధపడవలసి వస్తుంది.
మాండోవి వంతెనవద్ద రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత దాదాపు గంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడింది. గోవా స్వయంగా నడిచే వాహనాలతో ప్రాచుర్యం పొందింది. కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యాటకులు దాదాపుగా రోజువారీగా మోటార్ సైకిల్స్ మరియు కార్లను అద్దెకు తీసుకుని నడపడానికి బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
వాహనాలను డ్రైవ్ చేయడం రాకపోతే అటువంటి వారు వాహనాలను అద్దెకు తీసుకోకండి అని గోవా సిఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. డ్రైవింగ్ రానివాళ్లు సాధారణంగా కాకుండా రోడ్డుకి తప్పువైపునుండి డ్రైవింగ్ ప్రారంభిస్తారు. అందువల్ల చాలాసార్లు ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పారు.
వాహనాలను అద్దెకి తీసుకుని తప్పు చేసిన డ్రైవర్లకు ముఖ్యంగా పర్యాటకులకు జరిమానా విధించినందుకు పోలీసులు అనవసరంగా విమర్శలు ఎదుర్కొంటున్నారని సావంత్ అన్నారు.
పోలీసులు వారిని ఫ్లాగ్ చేసినప్పుడు వారు విమర్శలు ఎదుర్కొంటారు కాని పోలీసులు వారి భద్రత కోసం చలాన్లను మాత్రమే జారీ చేస్తారు అని సావంత్ చెప్పారు. ఎన్ని చేసినప్పటికీ ఇటువంటి ప్రమాదాలను నిలువరించలేకపోతున్నారు.
Read More:ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు
గోవాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఈ డ్రైవింగ్ రాని పర్యాటకులే ముఖ్య కారణం అని సిఎం చెప్పారు. గోవా రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలు గోవాలో ఆందోళనలకు కారణమయ్యాయి. తప్పు చేసిన డ్రైవింగ్ పద్ధతులపై రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాహనాలను డ్రైవ్ చేయడం రాని వారు వాహనాలను నడిపి ప్రమాదాల భారిన పడవద్దు అని తెలియజేసారు.