160 ఏళ్ల తొలి భారత రైలును గుర్తు చేస్తూ గూగుల్ డూడుల్
మీరు ఈరోజు (ఏప్రిల్ 14, 2013 మంగళవారం) గూగుల్ డూడుల్ (Google Doodle) చూశారా..? దీనికో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని విశిష్టమైన వ్యక్తుల జన్మదినాలు, వేడుకలు, పలు విశిష్ట ఆవిష్కరణలను గుర్తు చేస్తూ డూడుల్ (చిత్రాలతో కూడిన గూగుల్ సెర్చ్ ఇంజన్) రూపంలో ప్రపంచానికి తెలియజేస్తుంది. అలాగే ఈరోజు గూగుల్ డూడుల్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది మన దేశానికి సంబంధించినది.
160 ఏళ్ల క్రితం అంటే ఏప్రిల్ 16, 1853వ తేదీన భారతదేశపు తొలి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలెక్కిన రోజు. ముంబైలోని బోరి బందర్ నుంచి థానే వరకూ (34 కిలోమీటర్ల దూరం) ఈ రైలు ప్రయాణించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గూగుల్ తన ఇండియా హోమ్ పేజ్పై ఓ విశిష్టమైన డూడుల్ను రూపొందించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి రైలును ప్రతిభింభింపజేస్తుంది.
భారత్లోని ఈ తొలి రైల్వే ప్యాసింజర్ జర్నీ సుల్తాన్, సింథ్ మరియు సాబిబ్లు, 400 మంది ఆహ్వానిత ప్రయాణికులతో 14 భోగీలలో 57 నిమిషాల పాటు సాగింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక్క హాల్ట్ మాత్రమే ఉండేది. ఇది ఆవిరి యంత్రాల సాయంతో ముందుకు నడిచేది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియన్ రైల్వేస్ కూడా ప్రకటనలు జారీ చేసింది. మరి ఈ ట్రైన్ పురాతన ట్రైన్ను మనం కూడా చూసొద్దాం రండి..!

160 ఏళ్ల తొలి భారత రైలును గుర్తు చేస్తూ గూగుల్ డూడుల్
160 ఏళ్ల క్రితం అంటే ఏప్రిల్ 16, 1853వ తేదీన భారతదేశపు తొలి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలెక్కిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గూగుల్ తన ఇండియా హోమ్ పేజ్పై ఓ విశిష్టమైన డూడుల్ను రూపొందించింది.

160 ఏళ్ల తొలి భారత రైలును గుర్తు చేస్తూ గూగుల్ డూడుల్
ముంబైలోని బోరి బందర్ నుంచి థానే వరకూ (34 కిలోమీటర్ల దూరం) ఈ రైలు ప్రయాణించింది. భారత్లోని ఈ తొలి రైల్వే ప్యాసింజర్ జర్నీ సుల్తాన్, సింథ్ మరియు సాబిబ్లు, 400 మంది ఆహ్వానిత ప్రయాణికులతో 14 భోగీలలో 57 నిమిషాల పాటు సాగింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక్క హాల్ట్ మాత్రమే ఉండేది. ఇది ఆవిరి యంత్రాల సాయంతో ముందుకు నడిచేది.

భారతీయ రైలు

భారతీయ రైలు

భారతీయ రైలు



Click it and Unblock the Notifications








