ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్కు జరిమానా; పూర్తి వివరాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ అధికంగా ఉంది. ప్రస్తుతం కూడా దేశం మొత్తం కరోనా గుప్పెట్లో నలిగిపోతోంది. రోజురోజుకి దేశరాజధాని నగరం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మరోయు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ 19 అధికంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి, ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ వంటివి కూడా విధించడం జరుగుతోంది.

కోవిడ్ 19 వ్యాప్తి నివారించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం చాలావరకు తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరు ఉల్లంఘించిన వారికీ జరిమానా కూడా విధించబడుతుంది. ఇటీవల ఫేస్ మాస్క్ ధరించకుండా బస్సు నడుపుతున్న గవర్నమెంట్ బస్సు డ్రైవర్కు ఆరోగ్య శాఖ అధికారులు జరిమానా విధించినట్లు సమాచారం.

తమిళనాడులోని మదురై అరప్పలాయం బస్ స్టాండ్ ను ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించినప్పుడు గవర్నమెంట్ బస్సు డ్రైవర్ ఫేస్ మాస్క్ ధరించలేదని గుర్తించబడింది. కావున ఆ సమయంలో ఆ గవర్నమెంట్ బస్ డ్రైవర్ కి రూ. 200 జరిమానా విధించబడింది.

దీనిపై న్యూస్ 7 తమిళం ఛానల్ నివేదించింది. తమిళనాడు అంతటా ఫేస్మాస్క్ ధరించని వారిపై ఇప్పుడు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత అధికారులు బస్స్టేషన్తో సహా పలు చోట్ల తనిఖీలు జరిపి, జరిమానా విధిస్తున్నారు. ప్రజలు ఇంటి నుండి బయలుదేరే ముందు ఫేస్మాస్క్ ధరించడం మంచిది.

ఇది కరోనా వైరస్ నుండి మాత్రమే కాకుండా అధికారుల విధించే జరిమానా నుంచి కూడా మనలను రక్షిస్తుంది. ఇటీవల ఫేస్మాస్క్ ధరించకుండా పెట్రోల్ బంక్ కి వచ్చే వాహనదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ఇవ్వబోమని తమిళనాడులోని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ చర్యకు పెట్రోలియం డీలర్లు విస్తృతంగా స్పందించారు.

కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడంలో ఫేస్మాస్క్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ కొంతమంది ఫేస్ మాస్క్ ధరించడానికి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది వారికి మాత్రమే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

కరోనా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పకుండా ఫేసుమాస్క్ ధరించాలి. కొద్ది రోజుల క్రితం కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి కూడా పేస్ మాస్క్ తప్పనిసరి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఫేస్మాస్క్ ధరించనందుకు జరిమానా విధించడం వల్ల దీనిపై పిటీషన్ వేసిన న్యాయవాది పిటీషన్ ఇప్పుడు కోర్టు కొట్టివేసింది. అంతే కూండా ఇప్పుడు ఒంటరగా కారులో ప్రయాణిస్తున్న వారు కూడా పేస్ మాస్క్ ధరించాలి. ;లేకుంటే వారికీ కూడా భారీ జరిమానా విధించబడుతుంది. కావున ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి.


Click it and Unblock the Notifications








