Just In
- 9 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 10 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 13 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 14 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే ప్రతి ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నుండి మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.
సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం మరియు సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుజగుతాయి.
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం సెప్టెంబర్ 1, 2019 నుండి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధింస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనదారులు మాత్రమే కారణం కాదు. సరైన రోడ్లు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయి.
భారతదేశంలో రోడ్లు చాల వరకు క్షీణించాయి. ఇటువంటి సరైన రోడ్లు లేకపోవడానికి ప్రధాన కారణం అవినీతి రాజ్యమేలటం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉండే వారు స్వలాభాలను చూసుకోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి.
ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి మారుతోంది. దేశం రోజు రోజుకి ప్రగతి మార్గంవైపు అడుగులు వేస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వేగంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోంది.
నాణ్యమైన రోడ్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అంతే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిలో రహదారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దాదాపు 4,000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించింది. ఈ కారణంగా ఇది ఒక విజయంగా కనిపిస్తుంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 2019 ఆర్థిక సంవత్సరంలో 3,979 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తామని తెలిపింది. ఇంతకు మునుపు ఇంత పెద్ద జాతీయ రహదారులు నిర్మించబడలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో జాతీయ రహదారులు వేగంగా నిర్మిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,380 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారులను నిర్మించారు.
భారతదేశం యొక్క రహదారి నాణ్యత గతంలో కంటే ఎక్కువ మెరుగుపడుతోంది. ఇది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏది ఏమైనా భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నిర్మించడానికి మరియు దెస ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.