అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాహనాల వల్ల కాలుష్యం కూడా చాలా పెరిగిపోతోంది. కాలుష్య నివారణలో భాగంగా దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే చాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. అయితే ఇటీవల గురుగ్రామ్‌లో వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, జిల్లా యంత్రాంగం 'పరివర్తన్' ప్రచారాన్ని ప్రారంభించింది.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

దీని కింద గురుగ్రామ్‌లో నడుస్తున్న 12,000 డీజిల్ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ రిక్షాలుగా మార్చనున్నారు. ఈ ప్రచారం యొక్క మొదటి దశలో సుమారు 2 వేల ఎలక్ట్రిక్ రిక్షాలు ప్రారంభించబడతాయి. దీనికి పరిపాలనకు ఆటో రిక్షా అసోసియేషన్ మరియు డ్రైవర్ల మద్దతు లభించింది.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి, ఎంసిజి జోన్- IV అడిషినల్ కమిషనర్ జస్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ రానున్న కాలంలో పర్యావరణ కాలుష్యం తీవ్రమైన సమస్య అని, దాన్ని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు కొన్ని స్వల్పకాలిక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే పూర్తిగా నివారించడానికి దీర్ఘకాలిక నివారణ చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

దీనికి సమ్బద్నహించిన పౌరసంఘం 2 వేల ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా అమలుచేయడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించింద. అంతే కాకుండా ఆటో యూనియన్లు మరియు డ్రైవర్ల సహకారంతో వాహన కాలుష్యం వల్ల జరిగే అనర్థాలను తెలియజేస్తూ, నివారణకోసం ప్రచారం కూడా జరుగుతోంది.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

ఇందులో భాగంగానే మొదటి దశలో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చనున్నారు. ఎలక్ట్రిక్ రిక్షాలను కొనుగోలు చేయడానికి ఆటో డ్రైవర్లకు జిల్లా యంత్రాంగం తగిన సహకారం అందిస్తోంది. ఎలక్ట్రిక్ రిక్షాలు కాలుష్య కారకాలు కావు, ఎందుకంటే ఇవి యూవంటి వాయువులను గాలిలోకి విడుదల చేయవు. అంతే కాకుండా డీజిల్ ఆటో రిక్షాలకంటే తక్కువ ఖర్చుతో నడపవచ్చు.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు కొన్ని మౌలిక సదుపాయాల కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ ఆటోలను ఛార్జ్ చేయడానికి వివిధ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ స్టేషన్లలో ఛార్జింగ్‌తో పాటు బ్యాటరీ ఎక్స్ఛేంజింగ్ మరియు సర్వీసింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

డీజిల్ ఆటోల కంటే ఎలక్ట్రిక్ రిక్షా చాలా అధునాతనంగా ఉటుంది. ఎలక్ట్రిక్ రిక్షాలను రిపేర్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ అన్ని లక్షణాల దృష్ట్యా, దేశంలోని అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ రిక్షాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.

అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశంలో పేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చాలా వరకు తగ్గింపును అందిస్తుంది. ఫేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, త్రీ-వీలర్, నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కావున ఈ వాహనాలను కొనుగోలుచేసి వారికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటి వాటినుంచి మినహాయింపు ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, April 9, 2021, 18:30 [IST]
English summary
Gurugram Municipal Corporation To Convert 12,000 Auto Rickshaw Into Electric Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+