Just In
- 10 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 13 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 13 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 15 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?
దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాహనాల వల్ల కాలుష్యం కూడా చాలా పెరిగిపోతోంది. కాలుష్య నివారణలో భాగంగా దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే చాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. అయితే ఇటీవల గురుగ్రామ్లో వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, జిల్లా యంత్రాంగం 'పరివర్తన్' ప్రచారాన్ని ప్రారంభించింది.
దీని కింద గురుగ్రామ్లో నడుస్తున్న 12,000 డీజిల్ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ రిక్షాలుగా మార్చనున్నారు. ఈ ప్రచారం యొక్క మొదటి దశలో సుమారు 2 వేల ఎలక్ట్రిక్ రిక్షాలు ప్రారంభించబడతాయి. దీనికి పరిపాలనకు ఆటో రిక్షా అసోసియేషన్ మరియు డ్రైవర్ల మద్దతు లభించింది.
ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి, ఎంసిజి జోన్- IV అడిషినల్ కమిషనర్ జస్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ రానున్న కాలంలో పర్యావరణ కాలుష్యం తీవ్రమైన సమస్య అని, దాన్ని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు కొన్ని స్వల్పకాలిక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే పూర్తిగా నివారించడానికి దీర్ఘకాలిక నివారణ చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
MOST READ:భారత్లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?
దీనికి సమ్బద్నహించిన పౌరసంఘం 2 వేల ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా అమలుచేయడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించింద. అంతే కాకుండా ఆటో యూనియన్లు మరియు డ్రైవర్ల సహకారంతో వాహన కాలుష్యం వల్ల జరిగే అనర్థాలను తెలియజేస్తూ, నివారణకోసం ప్రచారం కూడా జరుగుతోంది.
ఇందులో భాగంగానే మొదటి దశలో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చనున్నారు. ఎలక్ట్రిక్ రిక్షాలను కొనుగోలు చేయడానికి ఆటో డ్రైవర్లకు జిల్లా యంత్రాంగం తగిన సహకారం అందిస్తోంది. ఎలక్ట్రిక్ రిక్షాలు కాలుష్య కారకాలు కావు, ఎందుకంటే ఇవి యూవంటి వాయువులను గాలిలోకి విడుదల చేయవు. అంతే కాకుండా డీజిల్ ఆటో రిక్షాలకంటే తక్కువ ఖర్చుతో నడపవచ్చు.
MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు కొన్ని మౌలిక సదుపాయాల కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ ఆటోలను ఛార్జ్ చేయడానికి వివిధ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ స్టేషన్లలో ఛార్జింగ్తో పాటు బ్యాటరీ ఎక్స్ఛేంజింగ్ మరియు సర్వీసింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.
డీజిల్ ఆటోల కంటే ఎలక్ట్రిక్ రిక్షా చాలా అధునాతనంగా ఉటుంది. ఎలక్ట్రిక్ రిక్షాలను రిపేర్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ అన్ని లక్షణాల దృష్ట్యా, దేశంలోని అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ రిక్షాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.
MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?
ప్రస్తుతం దేశంలో పేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చాలా వరకు తగ్గింపును అందిస్తుంది. ఫేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, త్రీ-వీలర్, నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కావున ఈ వాహనాలను కొనుగోలుచేసి వారికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటి వాటినుంచి మినహాయింపు ఉంది.