Just In
- 7 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 9 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 11 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 14 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?
జాతీయ రహదారులగుండా వెళ్తున్న వాహనాలను కొంతమంది దుండగులు అడ్డగించి మరియు వివిధ మార్గాల ద్వారా దొంగతనాలు చేస్తున్నట్లు ఇది వరకే చాలా పిర్యాదులు ఉన్నాయి. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో దోపిడీలు జరుగుతున్నాయి.
దొంగలు వివిధ పద్ధతుల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు. సహాయం కోరడం మరియు సహాయం కోసం తప్పించుకోవడం అనే నెపంతో కార్లను ఆపి దోచుకోవడం మామూలైపోయింది. జాతీయ రహదారులలో ట్రక్ మరియు కారు డ్రైవర్లను దొంగలు ఎక్కువగా దోచుకుంటున్నారు.
ఖరీదైన వస్తువులను కంటైనర్లలో లేదా ట్రక్ ల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తారు. కొన్నిసార్లు కదిలే కంటైనర్ ట్రక్కులను కూడా దోచుకుంటున్నాయి. హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగింది. 5 మెర్సిడెస్ బెంజ్ కార్లను కంటైనర్ ట్రక్కులో రవాణా చేస్తున్నారు. ఈ బెంజ్ కార్ల మొత్తం విలువ రూ. 3.50 కోట్లు.
MOST READ:యంగ్ కార్ట్ రేసర్పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?
దొంగల ముఠా ట్రక్ డ్రైవర్ను బెదిరించి ట్రక్కును దొంగిలించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే పోలీసులు దొంగలను అరెస్ట్ చేసి మెర్సిడెస్ బెంజ్ కార్లతో ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన అక్టోబర్ 4 రాత్రి జరిగినట్లు తెలిసింది. గ్యాంగ్స్టర్ల ముఠా ట్రక్ డ్రైవర్ను బెదిరించి అతన్ని తాడుతో కట్టి ట్రక్కుతో తప్పించుకుంటుంది. అక్కడికక్కడే కొంతమంది ఈ సంఘటనను గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గ్యాంగ్స్టర్ల అరెస్టు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వివిధ చోట్ల వాహనాలను పరిశీలించారు.
MOST READ:మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?
చివరకు రజాక్ ను గ్యాస్ స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. అతను నుహ్ జిల్లాలోని నాయి పట్టణానికి చెందినవాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి మెర్సిడెస్ బెంజ్ కార్లతో ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం రజాక్ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ట్రక్ డ్రైవర్లకు ఆందోళన కలిగించింది.
ఈ సంఘటన ఖరీదైన వస్తువులతో ప్రయాణించేటప్పుడు వాహనదారుల, ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లను జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తుంది. వాహనాలు దొంగిలించబడితే, వాటిని ట్రాకింగ్ పరికరాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇటువంటి ట్రాకింగ్ పరికరాలు తక్కువ ధరలకు మార్కెట్లో అందుబాటులో ఉన్నందున, వాహన యజమానులు వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ విధమైన ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించడం ద్వారా త్వరగా దొంగలను పెట్టుకోవచ్చు.
Note: Images are representative purpose only.
MOST READ:పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?