Just In
- 48 min ago Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- 2 hrs ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 4 hrs ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 4 hrs ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
Don't Miss
- News రాందేవ్బాబాకు సుప్రీం షాక్.. నేరుగా హాజరుకావాలని నోటీసులు!
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Finance Patanjali: బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Movies యాంకర్లను వెనక్కి నెట్టిన కమెడియన్లు.. అందరుమెచ్చిన బుల్లితెర నటుల్లో టాప్ 5 వీళ్లే!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?
జాతీయ రహదారులగుండా వెళ్తున్న వాహనాలను కొంతమంది దుండగులు అడ్డగించి మరియు వివిధ మార్గాల ద్వారా దొంగతనాలు చేస్తున్నట్లు ఇది వరకే చాలా పిర్యాదులు ఉన్నాయి. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో దోపిడీలు జరుగుతున్నాయి.
దొంగలు వివిధ పద్ధతుల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు. సహాయం కోరడం మరియు సహాయం కోసం తప్పించుకోవడం అనే నెపంతో కార్లను ఆపి దోచుకోవడం మామూలైపోయింది. జాతీయ రహదారులలో ట్రక్ మరియు కారు డ్రైవర్లను దొంగలు ఎక్కువగా దోచుకుంటున్నారు.
ఖరీదైన వస్తువులను కంటైనర్లలో లేదా ట్రక్ ల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తారు. కొన్నిసార్లు కదిలే కంటైనర్ ట్రక్కులను కూడా దోచుకుంటున్నాయి. హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగింది. 5 మెర్సిడెస్ బెంజ్ కార్లను కంటైనర్ ట్రక్కులో రవాణా చేస్తున్నారు. ఈ బెంజ్ కార్ల మొత్తం విలువ రూ. 3.50 కోట్లు.
MOST READ:యంగ్ కార్ట్ రేసర్పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?
దొంగల ముఠా ట్రక్ డ్రైవర్ను బెదిరించి ట్రక్కును దొంగిలించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే పోలీసులు దొంగలను అరెస్ట్ చేసి మెర్సిడెస్ బెంజ్ కార్లతో ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన అక్టోబర్ 4 రాత్రి జరిగినట్లు తెలిసింది. గ్యాంగ్స్టర్ల ముఠా ట్రక్ డ్రైవర్ను బెదిరించి అతన్ని తాడుతో కట్టి ట్రక్కుతో తప్పించుకుంటుంది. అక్కడికక్కడే కొంతమంది ఈ సంఘటనను గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గ్యాంగ్స్టర్ల అరెస్టు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వివిధ చోట్ల వాహనాలను పరిశీలించారు.
MOST READ:మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?
చివరకు రజాక్ ను గ్యాస్ స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. అతను నుహ్ జిల్లాలోని నాయి పట్టణానికి చెందినవాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి మెర్సిడెస్ బెంజ్ కార్లతో ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం రజాక్ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ట్రక్ డ్రైవర్లకు ఆందోళన కలిగించింది.
ఈ సంఘటన ఖరీదైన వస్తువులతో ప్రయాణించేటప్పుడు వాహనదారుల, ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లను జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తుంది. వాహనాలు దొంగిలించబడితే, వాటిని ట్రాకింగ్ పరికరాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇటువంటి ట్రాకింగ్ పరికరాలు తక్కువ ధరలకు మార్కెట్లో అందుబాటులో ఉన్నందున, వాహన యజమానులు వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ విధమైన ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించడం ద్వారా త్వరగా దొంగలను పెట్టుకోవచ్చు.
Note: Images are representative purpose only.
MOST READ:పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?