Just In
- 3 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 3 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల కోల్కతా ట్రాఫిక్ పోలీసులు డిస్ప్లే బోర్డుతో 11 స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ కెమెరాలను కోల్కతా మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటిస్తే ఎటువంటి చర్యలకు లోను కాకుండా ఉండవచ్చు. అలా కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోతే వారికి తప్పకుండా జరిమానా మరియు ఇతర శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది.
వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే, వారి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వారి మొబైల్కు ఎస్ఎమ్ఎస్ పంపబడుతుంది. ఇందులో వాహనదారుడు ఎంత వేగంతో వెళ్తున్నాడు అని వేగం యొక్క వివరాలు కూడా నివేదించబడుతుంది. ఈ కొత్త పద్ధతి రోడ్డుపై వేగ పరిమితిని తగ్గిస్తుంది. దీని ద్వారా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిపోతుంది.
గతంలో కూడా వేగాన్ని గుర్తించడానికి బోర్డులపై, వాహనదారులు వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వైట్ బోర్డింగ్ లైట్లు వెలిగేవి. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త బోర్డులు పరిమిత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళినట్లైతే 'రిస్క్' మరియు 'స్లో డౌన్' వంటి సిగ్నెల్స్ చూపిస్తాయి.
40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న ప్రాంతంలో ఒక వాహనదారుడు గంటకు 40 కి.మీ ప్రయాణించవచ్చని డిస్ప్లే బోర్డు చూపిస్తుంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఒక వేళా ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాపాయ స్థితినుంచి తప్పించుకోవచ్చు.
వాహనం యొక్క వేగ పరిమితి గంటకు 50 కిమీ దాటితే, 'డేంజర్' అని చూపుతుంది. సాధారణంగా వాహనదారుడు ప్రయాణించే రహదారిపై వేగ పరిమితి తమకు తెలియదని చాలా మంది వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు ఉన్న ఈ కెమెరాలు వాహనదారులకు సహాయపడతాయి.
ఈ బోర్డులు వాహనం యొక్క వేగాన్ని తెలుపుతుంది. కావున ఈ సమయంలో వాహనదారుడు తన వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఈ కెమెరాలు వేర్వేరు సందులలో ప్రయాణించే వేర్వేరు వాహనాల వేగాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఈ కెమెరాలు రాత్రి సమయంతో సహా అన్ని వాతావరణ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
భారతదేశం అంతటా ట్రాఫిక్ నేరాలను తగ్గించడానికి పోలీసులు ఇప్పుడు వివిధ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది పోలీసు అధికారులు మరియు వాహనదారుల మధ్య జరిగే వివాదాలను నివారిస్తుంది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిద్దటమైన చర్యలు అమలుచేసినప్పటికీ అది కేవలం వాహనదారుల సహకారంతోనే జరుగుతాయి. ప్రభుత్వం ఏది చేసిన ప్రజల మంచి కోసమే కావున, వాహనదారులు తప్పకుండా ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే పూర్తిగా ప్రమాదాలను ఆరికట్టవచ్చు.
Note: Images used are for representational purpose only.