Just In
- 32 min ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 1 hr ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాల్లో ఆంటిసెప్టిక్ రోబోట్స్
కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బదులను ఎదుర్కొంటున్నాయి. ఈ భయంకరమైన వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే చాలా మంది మరణించడం మాత్రమే కాకుండా, ఇప్పటికి ఎంతోమంది ఈ వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. ప్రారంభంలో సరైన భద్రతా చర్యలు తీసుకోని దేశాలు చాలా నష్టాన్ని చవిచూశాయి. ఈ దేశాలలోని ప్రజలు ఇతర దేశాలకు వెళ్ళినట్లైతే మరింత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రారంభంలో తగిన చర్యలు తీసుకున్న దేశాలకు పెద్దగా నష్టం జరగలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాంకాంగ్ విమానాశ్రయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ మొదట్లో చైనాలోని వుహాన్లో కనుగొనబడింది. ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ వ్యాప్తికి విమానాలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
గతంలో వైరస్ లు, బ్యాక్టీరియాలు ఈ కరోనా మహమ్మారిలాగా ఎక్కువగా వ్యాపించలేదు. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా అత్యధికంగా సంక్రమించడానికి విమానాలు ఎక్కువ కారణం అని చెప్పాలి.
MOST READ:బిఎస్ 6 మహీంద్రా ఎక్స్యువి : ధర & ఇతర వివరాలు
ఈ ఆధునిక యుగంలో మనిషి కేవలం కొన్ని గంటల్లో ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తున్నాడు. ఈ విధంగా దేశాలన్నీ తిరుగుతున్న కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైంది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి, హాంకాంగ్ విమానాశ్రయంలో ఆటోమేటిక్ క్రిమినాశక కేంద్రాలు ప్రారంభించబడ్డాయి.
ఈ కేంద్రాలు విదేశాల నుంచి వచ్చిన ప్రజలను నిశితంగా పర్యవేక్షిస్తాయి మరియు వైరస్ లను తొలగించడానికి సహాయపడతాయి. ఇది ఒకరకమైన రసాయన స్నానం. ఈ రోబోట్ యంత్రం వాహనాలను శుభ్రపరచడానికి యాంటిసెప్టిక్స్తో మనుషులను కూడా శుభ్రపరుస్తుంది.
MOST READ:భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వారి కొత్త పాలసీ, ఏంటో తెలుసా ?
కేవలం 40 సెకన్లలో మనుషులలో ఉన్న వైరస్ ని నాశనం చేస్తాయి. దీనికి ఎక్కువ సమయం నిరీక్షణ అవసరం లేదు. వైరస్ వ్యాప్తి చెందుతున్నందున హాంకాంగ్ విమానాశ్రయ అధికారులు ఈ క్రిమినాశక పరికరాలను ఎక్కువగా ఉపయోగించాలని యోచిస్తున్నారు. టెలిఫోన్ బూత్లను వ్యవస్థాపించడం కంటే క్రిమినాశక యంత్రాలను వ్యవస్థాపించడం చాలా సులభం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణీకుల భద్రత కోసం ఈ రకమైన యంత్రాలు చాలా అవసరం.
యంత్రాల లోపలి భాగంలోని యాంటీ మైక్రోబియల్ పూత స్వయంచాలకంగా వైరస్ మరియు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఈ యంత్రాలు మానవ శరీరం మరియు దుస్తులలో ఉన్న వైరస్ నుండి విముక్తి కలిగిస్తాయి.
MOST READ:రూ. 2 లక్షల లోపు బిఎస్ 6 బైక్ కొంటున్నారా, అయితే ఈ 5 బైక్స్ చూడండి
విమానాశ్రయాలలో ఈ సదుపాయాలను తీసుకురావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు హాంకాంగ్ విమానాశ్రయంపై శ్రద్ధ చూపుతున్నాయి. ఈ యంత్రాలను ప్రయాణీకుల భద్రత కోసం ఉపయోగిస్తారు.
ఉద్యోగులు వర్క్ సమయంలో ఫేస్ షీల్డ్స్ ధరిస్తారు. కానీ బయట వారు వైరస్ భారిన పడే అవకాశాలు ఉన్నాయి. యంత్రం లోపలి భాగం గడియారం లాంటిది. ఇది 99.99% ఈ కారణంగా క్రిమిరహితం చేయబడుతుంది. ఈ రోబోట్ క్రిమినాశక యంత్రాలలో అతినీలలోహిత లైటింగ్ మరియు గాలి శుద్దీకరణ వంటివి ఉన్నాయి.
MOST READ:మళ్లీ, మళ్లీ యూస్ చేసుకోవడానికి మావోక్స్ రీసైకిల్ ఫేస్ షీల్డ్