Just In
- 39 min ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 49 min ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 15 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 15 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- News కొంచెం ఓపిక పడితే .. అమరావతి రైతులకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఊరట..!
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Movies విశ్వంభరలో ‘పాత చిరంజీవి’.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూవీ హిట్టే!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!
భారతదేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగడమే దీనికి ఒక ప్రధాన కారణం. పర్యావరణం సమతుల్యంగా ఉండటానికి కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక రకంగా ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదపడుతుంది.
ఈ కారణంగా దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాయి. కానీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో ఉపయోగించబడవు. హ్యుందాయ్, ఎంజి, టాటా, ఏథర్, బజాజ్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్నిపెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచే అవకాశం ఉంది.
MOST READ:ఇండియాలో ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతోనే హెలికాఫ్టర్ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?
ఈలోపు కొందరు తమ పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. ఇప్పుడు కృష్ణగిరి జిల్లాలోని హోసూర్కు చెందిన ఒక కార్మికుడు తన సైకిల్ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హోసూర్ అవలపల్లి అడ్కో ప్రాతంలో చాలా పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఐటిఐ చదివిన పాండిరాజన్ అక్కడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?
అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ లాక్ డౌన్ సమయంలో మూసివేయబడింది. లాక్ డౌన్ సడలించిన తరువాత అతడు పని చేసే ఫ్యాక్టరీ పునః ప్రారంభించబడింది. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో పాండిరాజన్ తన సైకిల్ ని ఎలక్ట్రిక్ సైకిల్ గా తయారుచేసాడు.
పాండిరాజన్ ఫ్యాక్టరీకి వెళ్లే దారి చదునుగా లేదు. అనేక హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రతి రోజు సైకిల్ తొక్కిన తరువాత తనకి కీళ్ల నొప్పులు వచ్చేవి. పాండిరాజన్ కొడుకు ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు పెడల్ కి బదులుగా యాక్సిలరేటర్ ఉపయోగించమని సూచించాడు.
MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్
అతని సూచన సరైనదని అనుకున్న తరువాత వారు తమ సైకిళ్లను ఎలక్ట్రిక్గా మార్చాలని నిర్ణయించుకున్నారు. సైకిల్కు 250W మోటారు అమర్చారు. దీని కోసం పాండిరాజన్ రూ. 12000 రూపాయలు ఖర్చు చేసాడు.
ఎలక్ట్రిక్ సైకిల్ను తయారుచేయడం వల్ల పాండిరాజన్ ను చాలామంది ప్రశంసించారు. దీనిపై సన్ న్యూస్ తమిళం ప్రత్యేక కథనాన్ని నివేదించింది.
MOST READ:భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్మోటో బైక్లు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల వాహనదారులు చాల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడంపై మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం కూడా ఒక కారణం అయింది. సాధారణంగా ఎత్తైన ప్రదేశాలలో సైక్లింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ కారణంగా పాండిరాజన్ ఎలక్ట్రిక్ సైకిల్ అభివృద్ధి చేయవలసి వచ్చింది. ఈ విధంగా పుట్టుకొచ్చినదే ఈ ఎలక్ట్రిక్ సైకిల్
Image Courtesy: Sun News Tamil