హైదరాబాద్ కమిషనర్ కట్ట వలసిన ట్రాఫిక్ జరిమానా ఎంతో తెలుసా
ఈ రోజులలో సోషల్ మీడియా ను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో మనకి తెలుసు, ముఖ్యంగా ఆసక్తికరమైన విషయాల గురించి బాగా పాపులర్ అవుతుంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ప్రముఖ వ్యక్తుల గురించి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే విష్యం సాధారణ వ్యక్తి గురించి కాదు, అక్షరాలా కమిషనర్కు సంబంధించిన విషయం.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసులు సోషల్ మీడియా వేదికగా చురుగ్గా వాహనదారులకు జరిమానాలు విధించేందుకు డిజిటల్ మార్గాలను అవలంబిస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో జరిమానాలు విధించడం వలన, ఇటీవలి కాలంలో జరిగిన తనిఖీలలో వేసిన జరిమానల సంఖ్య బాగా పెరిగింది.

రోడ్లపై ఇతర వాహనదారుల ఎలాంటి దురాగతాలను పాల్పడిన పౌరులు సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫాంలను ఉపయోగించి వాటిలో అందరికి తెలిసేటట్టు చేస్తున్నారు. రోడ్లపై ఉన్న ఇతర వాహనదారులు కూడా సరైన నిబంధనలను పాటించలేదని, వీరితో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా ఇలా చేస్తే వారిని ఎవరు శిక్షిస్తారు. వీరి గురించి తెలియాలంటే సోషల్ మీడియా మాత్రమే సరిఅయిన మార్గం.

ఇటీవల హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇదే తరహా కేసు ఎదుర్కొన్నాడు. ఇతని వాహనం కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలను చేయడం ద్వారా వాహనాన్ని సోషల్ మీడియాలో పెట్టారు, మొత్తం జరిమానా రూ 6,210 మాత్రమే ఉన్నప్పటికీ, ఈ ఇష్యూ కారణంగా కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కు పెద్ద ఇబ్బందే ఎదురైంది.

తన అధికారిక తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ చిత్రాలు పెండింగ్ లో ఉన్న ఫైన్ చిత్రాన్ని కూడా అప్ లోడ్ చేయడం ద్వారా ఇవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారడం జరిగింది. ఈ వేహికల్ ఓవర్ స్పీడ్/ప్రమాదకరమైన డ్రైవింగ్ ఉల్లంఘనలు చేయడం వలన ఈ వాహనానికి చాల సార్లు జరిమానా పడింది.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
పెండింగ్ లో ఉన్న ఓవర్ స్పీడ్ చలానాల తో వాహనాన్ని చూపించే అధికార హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో ఆరు ఘటనలు జరిగాయి. ఇందులో అధికారిక నెంబర్ ప్లేట్ TS09FA4248 ఉన్న వాహనం ఉంది, దీనిని ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న ఎం దాన కిశోర్ వినియోగిస్తున్నారు.

రిపోర్టుల ప్రకారంగా, రాజేందర్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చెన్ననామా హోటల్ సమీపంలో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో మరో రెండు ఉల్లంఘనలు చోటు చేసుకోగా, వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సైతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓవర్ స్పీడ్/ప్రమాదకరమైన డ్రైవింగ్ కు ఫైన్ జారీ చేశారు.

సోషల్ మీడియా నుంచి దీని గురించి తెలుసుకున్న వెంటనే కమిషనర్ కు జరిమానాలు చెల్లించారు. ఒక్కో ఫైన్ రూ 1,000, యూజర్ చార్జీలతో సహా రూ 1,035 కు చెల్లించారు. ఇటువంటి పెండింగ్ జరిమానాలు ఎప్పటికప్పుడు జోడిస్తుంటారు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ వాహనదారులకు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో పెండింగ్ చలాన్లు తనిఖీ చేయాలని సలహా ఇస్తున్నారు. ఇంతకు ముందు, చాలా మంది వాహనదారులు సుమారు రూ. లక్షకు పైగా జరిమానాతో పట్టుబడ్డారు. ఒకవేళ వాహన యజమాని అక్కడికక్కడే జరిమానా చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టు చలాన్ జారీ చేయవచ్చు.

ఇప్పుడు రోడ్డు యొక్క జంక్షన్ వద్ద పోలీస్ అధికారులు, ఆకుపచ్చ రంగులోకి వచ్చే సిగ్నల్ కొరకు వేచి ఉన్న వాహనాలను రిజిస్ట్రేషన్ నెంబరును ముందుంచారు. పెండింగ్ చలాన్ ఉన్న ఏ వాహనదారులను ఆపి, అక్కడికక్కడే జరిమానా చెల్లించాలని కోరారు.


Click it and Unblock the Notifications








