Just In
- 6 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 10 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 12 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 15 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్
భారతదేశంలో దేశవ్యాప్తంగా వాహన దొంగతనం కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాలను నివారయించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దొంగతనాలను పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన సైబరాబాద్ లో ఒక దొంగతనం కేసు నమోదయ్యింది. ఈ దొంగతనానికి పాల్పడిన దొంగ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఇంజనీర్ గ్రాడ్యుయేట్ చేసిన ఈ దొంగ వాహనాలను దొంగిలించి సెకండ్ హ్యాండ్ వాహన మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఈ దొంగతనాలకు కారకుడైనా యువకుడు 27 సంవత్సరాల 'గుడాటి మహేష్ కుమార్' గా గుర్తించారు. ఇతనికి బైక్స్ మరియు కార్స్ అంటే చాలా పిచ్చి.
నివేదికల ప్రకారం ఈ నిందితుడు అత్యంత ఖరీదైన వాహనాలను కూడా చాలా తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఒక్క ఏడాదిలోనే 7 రాష్ట్రాల్లో ఆరు ఖరీదైన కార్లు కొట్టేసి సొమ్ము అమ్మేశాడు. అయితే ఇటీవల కాలంలో మహేష్ కుమార్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ కొట్టేసి ఆ బైక్ మీద లడఖ్ వరకు పర్యటించాడు.
MOST READ:బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త బైక్; పూర్తి వివరాలు
పర్యటన నుండి తిరిగి వచ్చిన ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడాటి మహేష్ కుమార్ కి లాంగ్ జర్నీ మరియు పర్యటనలు అంటే చాలా ఇష్టమని న్యాయ విచారణలో తెలిసింది. భవిష్యత్తులో ట్రావెల్ ఏజెన్సీని స్థాపించాలన్నది అతని కల.
పశ్చిమగోదావరికి జిల్లా భీమవరానికి చెందిన గుడాటి మహేష్ నూతన్ కుమార్ 2016లో ఈఈఈలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు. మలక్పేటలో మొబైల్ టెక్నీషియన్గా చేరాడు. తాను పనిచేస్తున్న మొబైల్ షాఫును నకిలీ తాళం చెవులతో తెరిచి ఫోన్లు, ఇతర యాక్సెసెరీస్ దొంగిలించడంతో దొంగగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.
MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?
అతనికి పర్యటనల పట్ల ఆసక్తి ఇప్పుడు మొదలైంది కాదు, చిన్నప్పటి నుండి పర్యటనల పట్లు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ కారణంగా అతనికి ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉన్నాడు.
సుదూర ప్రాంతాలకు పర్యటనకు వెళితే, ఆ ప్రదేశాలలో ఎక్కువ మంది ప్రజలు అతని స్నేహితులు అవుతారు. విచారణలో కూడా ఎక్కువ ప్రయాణిస్తూనే ఉంటాడని తెలిసింది. సుదూర పర్యటనకు వెళ్లడానికి అతనికి ఒక వెహికల్ వాహనం అవసరం. కానీ అతని వద్ద వాహనం కొనడానికి తగినంత డబ్బు లేదు.
MOST READ:ల్యాండ్ రోవర్పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
ఈ కారణంగా అతడు ఈ రకమైన దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మహేష్ కుమార్ తన సన్నిహితుల వెహికల్ రికార్డులను వారికీ తెలియకుండా కాఫీ చేసి వాహనాలను రెంటెడ్ కార్ కంపెనీలకు లీజుకు ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కొన్ని వాహనాలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించాడు.
మహేష్ కుమార్ చాలా నెలలుగా ఇలా చేస్తున్నప్పటికీ, అతని స్నేహితులకు ఏ మాత్రం ఇది తెలియదని పోలీసులు తెలిపారు. వాహనాలను దొంగిలించి, సెకండ్ హ్యాండ్ వాహన మార్కెట్లో విక్రయించడంలో మహేష్ యొక్క ట్యాలెంట్ చూసి పోలీసు శాఖ ఆశ్చర్యానికి గురైంది. జూమ్ కార్, రెవ్స్ వంటి సంస్థల నుండి వాహనాలను అద్దెకు తీసుకొని మహేష్ వాహనాన్ని నడుపుతున్నాడు.
MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్పుల్ ఎస్యూవీ
మహేష్ కుమార్ వాహనాలను దొంగిలించిన వెంటనే, వాటిలో ఉన్న నిఘా పరికరాలను తొలగించేవాడు. అప్పుడు వాహనాలను వేరే ప్రాంతంలో అమ్మేవాడు. అతను కేవలం వాహనాలను మాత్రమే కాదు మొబైల్ ఫోన్లు కూడా దొంగిలించాడని పోలీస్ శాఖ వారి దర్యాప్తులో తేలింది.