Just In
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 5 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ACP అని చెప్పుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ క్రమంలో దేషములో చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. కరోనా వైరస్ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా లాక్ డౌన్ లో అనవసరంగా బయట తిరిగే వాహనదారులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా వాహనాలను కూడా స్వాదీనం చేసుకుంటున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజా రవాణా మొత్తం నిలిపివేయబడింది. అంతే కాకుండా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలనే కఠినమైన ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. లాక్డౌన్ నిబంధనలను బయట తిరిగే వాహనదారులను పోలీసులు అరెస్ట్ కూడా చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించి పట్టుబడ్డ వాహనదారులకు సంబంధించిన చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇటీవల మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన తెలంగాణా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో జరిగింది.
MOST READ:గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు
ఈ సంఘటనలో పేర్కొన్న వ్యక్తి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అని పేర్కొన్నారు. కానీ పోలీసులను తనిఖీ చేసిన తరువాత, అతను నకిలీ పోలీసు అధికారి అని తేలింది. హైదరాబాద్ పోలీసులు తనిఖీ చేసిన తరువాత మహీంద్రా స్కార్పియో కారును ఆపారు. లోపల ఉన్న వ్యక్తి తాను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అని చెప్పాడు.
అతను తన ఐడి కార్డును కూడా చూపించాడు. కానీ అక్కడి ఉన్నతాధికారి అది నకిలీ ఐడి కార్డు అని తెలుసుకున్నారు. అప్పుడు కారు లోపల ఉన్న వ్యక్తిని పోలీసులు బయటకు రమ్మని చెప్పారు. బయటకు వచ్చిన వ్యక్తి తాను జర్నలిస్ట్ అని అస్పష్టమైన సమాధానం ఇచ్చాడు, ఈ ఐడి కార్డు తన తండ్రికి చెందినదని చెప్పాడు.
MOST READ:మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
పోలీసులు తరువాత ఆ వ్యక్తి పర్స్ టెస్ట్ చేసినప్పుడు, అందులో వివిధ విభాగాలకు చెందిన పలు నకిలీ ఐడి కార్డులు ఉన్నట్లు గుర్తించబడింది. నకిలీ ఐడి కార్డులు కలిగిఉన్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా అతని మహీంద్రా స్కార్పియోని కూడా అరెస్ట్ చేశారు.
దీనిపై టీవీ 31 న్యూస్ నెట్వర్క్ నివేదించింది. ఖరీదైన కార్లతో సహా భారతదేశంలో ప్రతిరోజూ వేలాది వాహనాలు కరోనా లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నాయి. ఇందులో పేదలు, ధనికులు అనే బేధం లేకుండా పోలీసులు పోలీసులు వాహనాలను జప్తు చేస్తున్నారు.
MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్యూవీ300; వైరల్ అవుతున్న వీడియో
ఇటీవల బెంగళూరులో కేవలం 10 రోజుల్లో లాక్ డౌన్ ఉల్లంఘించిన 10,000 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికల ద్వారా తెలిసింది. వాహనాలు రోజురోజుకి ఎక్కువవుతున్న కారణంగా, ఆ వాహనాలను పార్కింగ్ చేయడానికి తగిన స్థలం లేకపోవడం వల్ల ఆ వాహనాలను పోలీసులు వాహన యజమానులకు అప్పగించాలని నిర్ణయించారు.
గత సంవత్సరం లాక్ డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇచ్చారు. ఇందులో కూడా ద్విచక్ర వాహనాలకు రూ. 500, కార్లకు రూ. 1,000 జరిమానా విధించారు. కావున ఇప్పుడు మళ్ళీ వాహనదారులకు వాహనాలను అప్పగించే సమయంలో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
MOST READ:సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!
Image Courtesy: Tv 31 News Network